/rtv/media/media_files/2025/06/15/nuPD1oHk5mBqeWYimJyH.jpg)
PM Modi arrives in Cyprus on first leg of three-nation tour
ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ద్వీప దేశమైన సైప్రస్లో అడుగుపెట్టారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆయనకు స్వాగతం పలికారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి సైప్రస్లో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో క్రిస్టోడోలైడ్స్తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. వాణిజ్యం, టెక్నాలజీ, డిఫెన్స్, పునరుత్పాదక ఇంధనం, కౌంటర్ టెర్రరిజంతో పాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసేలా చర్చలు జరపనున్నారు.
Also Read: ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్కు వేలాడదీసిన భర్త
సైప్రస్ నుంచి ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న జీ7 సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జూన్ 16-17న కననాస్కిస్లో జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం ఇది ఆరోసారి. జీ7 దేశాధినేతలతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఆ దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో సాంకేతికత, ఆవిష్కరణ, ఇంధన భద్రత ఇతర అంశాలపై చర్చలు జరపనున్నారు.
ఇక తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ జూన్ 18న ఐరోపాలని క్రొయేషియాకు వెళ్తారు. ఆ దేశంలో భారత ప్రధానమంత్రి పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే మూడు దేశాల పర్యటనకు ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. మధ్యధరా, ఈయూ ప్రాంతంలో సైప్రస్ విలువైన భాగస్వామి దేశంగా పేర్కొన్నారు. అయితే ఈ పర్యటన ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతికం లాంటి రంగాల్లో సంబంధాలు మరింత పెంపొందిస్తుందని తెలిపారు.
Also Read: మహారాష్ట్ర పూణెలో కుప్పకూలిన వంతెన పలువురు మృతి.. 25 మంది గల్లంతు