Maha Kumbh Mela 2025: 27 ఏళ్ల క్రితం మిస్సింగ్.. కుంభమేళాలో అఘోరిగా కనిపించిన భర్త .. చివరకి ట్విస్ట్ ఏంటంటే!

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.  ప్రస్తుతం 65 ఏళ్ల వయసులో ఉన్న గంగాసాగర్ యాదవ్ 1998లో పాట్నా వెళ్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు.  27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ మహిళ గుర్తించింది. పూర్తి స్టోరీ చదవండి.

New Update
Maha Kumbh 2025

Maha Kumbh 2025 Photograph: (Maha Kumbh 2025)

ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.  ప్రస్తుతం 65 ఏళ్ల వయసులో ఉన్న గంగాసాగర్ యాదవ్ 1998లో పాట్నా వెళ్లి అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు.  27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ మహిళ గుర్తించింది.  1998లో జార్ఖండ్ కు చెందిన భార్య, ధన్వా దేవి, ఇద్దరు కుమారులు, కమలేష్ , విమలేష్‌లను ఒంటరిగా వదిలేసి  వెళ్లిపోయాడు  గంగాసాగర్ యాదవ్.  అప్పటినుంచి అతని కుటుంబం అతని కోసం వెతకని చోటు లేదు.  తాజాగా కుంభమేళాకు వచ్చిన వారికి గంగాసాగర్ యాదవ్ అఘోరిగా కనిపించాడు.  అతడి నుదిటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు గుర్తించి ఇతను తన భర్తేనని  ధన్వా దేవి గుర్తించింది.  అయితే వారితో ఇంటికి వచ్చేందుకు గంగాసాగర్ యాదవ్  నిరాకరించాడు. 

Also Read :  టెన్త్ విద్యార్థులకు రేవంత్ సర్కార్‌ గుడ్ న్యూస్

Jharkhand Family Finds Lost Member As Monk In Maha Kumbh Mela

తనకు ఎవరూ లేరని ఇప్పుడు తాను గంగాసాగర్ యాదవ్ ను కాదని వారణాసికి చెందిన బాబా రాజ్‌కుమార్ సాధువు అని చెప్పుకున్నాడు.  ధన్వా దేవి కుటుంబం కుంభమేళా పోలీసులను ఆశ్రయించింది.  అవసరమైతే డీఎన్ఏ పరీక్షకు కూడా తాము సిద్దమని గంగాసాగర్ తమ్ముడు మురళీ యాదవ్ వెల్లడించారు. కుంభమేళా ముగిసే వరకు వేచి ఉంటామని తెలిపారు.  అతని కుటుంబంలోని కొందరు ఇంటికి తిరిగి వెళ్లిపోగా..  మరికొందరు గంగాసాగర్ యాదవ్ ను నిశితంగా గమనిస్తూ కుంభామేళాలోనే ఉన్నారు. గంగాసాగర్ యాదవ్ ఇంటినుంచి వెళ్లిపోయినప్పుడు అతని పెద్ద కొడుకు కేవలం రెండు సంవత్సరాలు కాగా అతని చిన్న కొడుకు ఇంకా పుట్టలేదు. అప్పుడు ధన్వా దేవి ప్రెగ్నెంట్ గా ఉన్నారు. మొత్తానికి కనిపించకుండా పోయిన తమ కుటుంబ సభ్యుడు కుంభమేళాలో కనిపించడం అనందగా ఉందని వెల్లడించారు. 

Also Read :  పెళ్లి కోసం ఆరాటంగా వెళ్లిన వరుడు..తీరా అక్కడ ట్విస్ట్‌ మామూలుగా లేదుగా!

మరోవైపు మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మొత్తం 30 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.  జనవరి 29 తెల్లవారుజామున ఘాట్‌లో ఏర్పాటు చేసిన బారికెట్లు ధ్వంసం కావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని డీఐజీ వైష్ణవ్ కృష్ణ తెలిపారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తొక్కిసలాటపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది.  జస్టిస్ కృష్ణ కుమార్ ఆద్వర్యంలో న్యాయ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. 

Also Read :   ప్లే స్టోర్ లో డీప్‌ సీక్‌ దూకుడు..కానీ ఆ ప్రశ్నలకు మాత్రం!

Also Read :  NEET సీట్ల కేటాయింపుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
తాజా కథనాలు