/rtv/media/media_files/2025/06/06/KMU4xdh7amu2Cx8lruDo.jpg)
చత్తీష్గఢ్ స్టేట్ బీజాపూర్ నేషనల్ పార్క్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత చనిపోయినట్లు తెలుస్తోంది. AK47తో పాటు నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన అడేళ్ల భాస్కర్గా చెబుతున్నారు. భాస్కర్పై రూ. 25 లక్షల రివార్డు ఉంది.
Also Read : బాలయ్య మంచి మనసు! అభిమాని కొడుక్కి అన్నం తినిపించిన వీడియో వైరల్
Also Read : కేటీఆర్కు సుప్రీం కోర్టు నోటీసులు.. ఎందుకంటే?
Maoist Encounter - Adella Bhaskar
చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా లో గురువారం కూడా భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరైన, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్, భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు హతమైన నెల రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
గత ఆరు నెలల కాలంలో మావోయిస్టు కేంద్ర కమిటీకి చెందిన ముగ్గురు కీలక నాయకులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేయడం, మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా పరిగణిస్తున్నారు. మూడు వారాల వ్యవధిలోనే ఇది రెండో పెద్ద ఎదురుదెబ్బ.
Also Read : భారత్లో ఎలన్ మస్క్ స్టార్లింక్ సేవలకు పచ్చజెండా
Also Read : దీపికకు నేనంటే చాలా ఇష్టం.. నాతో రెండేళ్లు తిరిగింది: మాజీ ప్రియుడు సంచలనం!
maoist | telangana | Adella Bhaskar | encounter | bijapur encounter | chattisaghad | chattisgarh border