/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ayodhya-ram-mandir-1-jpg.webp)
Ayodhya Photograph: (Ayodhya )
ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో ఆలయ నిర్మాణం ఐదు శతాబ్దాల తర్వాత జరిగింది. దీంతో భక్తులు అయోధ్యకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య రామమందిరంలో భక్తుల రద్దీని తగ్గించేందుకు కొత్తగా సొరంగ మార్గాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. 80 మీటర్ల పొడవు ఉండే ఈ సొరంగం గుండా ఒకేసారి 1.5 లక్షల మంది భక్తులు ప్రదక్షిణలు చేసే వీలుంటుందని అధికారులు వివరించారు. దేశంలోని ఆలయాల్లో ఇదే అతిపెద్ద సొరంగమని ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ మెహతా పేర్కొన్నారు.
Also Read: Musk-India:-Modi: త్వరలోనే ఇండియాకు రాబోతున్నా..: ఎలాన్ మస్క్
ఆలయానికి తూర్పు భాగంలో.. నేలమట్టానికి 15 అడుగుల దిగువన ఈ సొరంగం ఉండబోతుంది. దీని పొడవు 80 మీటర్లు. ప్రదక్షిణ చేసే భక్తులు, ఆలయానికి వచ్చే భక్తులు ఒకే చోట ఉండటం వల్ల తీవ్రమైన రద్దీ ఏర్పడుతుంది. ఈ రద్దీని నివారించడానికి ఈ సొరంగం ఉపయోగపడుతుంది.ఈ సొరంగం ద్వారా ఒకేసారి లక్ష మందికిపైగా భక్తులు ప్రదక్షిణలు చేయడానికి అవకాశం ఉంటుంది. సుమారు 1.5 లక్షల మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణలు చేయవచ్చని, దేశంలో ఆలయ ప్రదక్షిణ కోసం ఇంత పెద్ద సొరంగం ఎక్కడా,ఏ ఆలయంలో లేదని అధికారులు అంటున్నారు.
Also Read: BIG BREAKING: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలివే!
భక్తుల రద్దీని తగ్గించేలా ఈ సొరంగాన్ని ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ మెహతా చెప్పారు. ప్రదక్షిణ కోసం 800 మీటర్ల పొడవైన గోడను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఈ సొరంగం కూడా ఒక భాగం. అక్టోబరు నాటికి సొరంగం పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.
సుదీర్ఘ న్యాయవివాదం అనంతరం 2019 నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అయోధ్యలో మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఆగస్టు 2020లో ఆలయ నిర్మాణానికి శుంకుస్థాపన చేసి.. పనులను శరవేగంగా పూర్తిచేసి 2024 జనవరిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
Also Read: Telangana: వదలని వర్షాలు.. మరో 2 రోజులు వానలే..వానలు..!
ayodya | ayodya-rama-mandhir | ayodya-rammandir | ayodya-ram-temple | tunnel | latest-news | latest-telugu-news | latest telugu news updates