వరుస ఎన్ కౌంటర్లతో వందలాది మంది మావోయిస్టులు పిట్టల్లా రాలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలో కాల్పులు నిలిపివేయాలని బహిరంగ లేఖ విడుదల చేశారు. తాము కూడా కాల్పుల విరమణను పాటిస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. మార్చి 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ ను స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. తాము చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీకి, దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, జర్నలిస్టులకు, ఇతర సంఘాలకు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా, తాలూకా కేంద్రాల్లో, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్ ను చేపట్టాలని కోరారు.
ఇది కూడా చదవండి:Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మళ్లీ కాల్పులు.. వరంగల్ మహిళా మావోయిస్టు మృతి
శాంతి చర్చల కి మేం సిద్దం - మావోయిస్టులు
— Telugu Reporter (@TeluguReporter_) April 2, 2025
మావోయిస్టుల పై జరుగుతున్న దమన కాండను నిలుపుదల చేయాలంటూ ప్రకటన విడుదల
భారత ప్రభుత్వం-సీపీఐ (మావోయిస్టు) బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి
మార్చి 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ ను… pic.twitter.com/1WFM1BjDTb
2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం, విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 'కగార్' పేరుతో విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల ప్రజలపై ప్రతిఘాతక యుద్ధాన్ని ప్రారంభించాయని లేఖలో ఫైర్ అయ్యారు. ఆ సమయంలో ప్రజల్ని మోసగించడానికి ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి విజయ్ శర్మ తమ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపడానికి సిద్ధమే, మావోయిస్టులు చర్చలకు రావాలని పదే పదే ప్రకటనలు చేశాడన్నారు.
ఇది కూడా చదవండి:Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!
చర్చలకు సిద్ధమని అప్పుడే ప్రకటించాం..
ఆ సమయంలో మా పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి కామ్రేడ్ వికల్ప్ తమ పార్టీ శాంతి చర్చలకు సిద్ధమేనని ప్రకటించినట్లు గుర్తు చేశారు. సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం 'కగార్' పేరుతో ఆదివాసీ ప్రజానీకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యాకాండను నిలిపివేయాలని ప్రతిపాదించాడన్నారు. బస్తర్ ప్రాంతంలో మోహరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలను బ్యారక్ లకే పరిమితం చేయాలని సూచించాడన్నారు.
సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదన చేశాడన్నారు. ఈ ప్రతిపాదన పట్ల స్పందించకుండా, జవాబు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత 15 నెలలుగా విప్లవోద్యమ ప్రభావిత రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ లో ప్రతిఘాతక 'కగార్' యుద్ధాన్ని తీవ్రంగా కొనసాగిస్తున్నాయన్నారు. ఈ యుద్ధంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 400కు పైగా మరణించారన్నారు. ఇందులో 1/3 సంఖ్యలో సాధారణ ఆదివాసీ ప్రజలు హత్య చేయబడ్డారని ఆరోపించారు.
(Tags : maoist | telugu-news | latest-telugu-news | telugu breaking news)