Blood Pressure: బీపీ చెక్‌ చేసుకునేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు

బీపీని తనిఖీ చేస్తున్నప్పుడు చేయిని ఒడిలో పెట్టడం, చేయి కింద లేకపోవడం, చేయిని కిందికి వేలాడదీయడం వంటి తప్పులు బీపీ రీడింగ్‌లో సగటున 6.5 పాయింట్లు జరుగుతాయి. కాబట్టి రక్తపోటు పరీక్ష తీసుకునేటప్పుడు సరిగ్గా కూర్చోవాలని నిపుణులు చెబుతున్నారు.

New Update

Blood Pressure: మారిన జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం వల్ల బీపీ సమస్యలు తలెత్తుతాయి. వయసుతో సంబంధం లేకుండా బీపీతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. అయితే చాలా మందికి తమకు బీపీ ఉందని తెలియదు. మనం రక్తపోటును కొలిచేటప్పుడు చేసే ఈ తప్పులు బీపీ రీడింగ్‌లను సగటున 6.5 పాయింట్లు పెంచుతాయని తేలింది. కాబట్టి BP తనిఖీ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలోఈ ఆక్టికల్‌లో తెలుసుకుందాం. 

రక్తపోటును కొలిచేటప్పుడు..

రక్తపోటు పరీక్ష చేస్తున్నప్పుడు, కఫ్ సరిగ్గా చేయి చుట్టూ చుట్టబడిందో లేదో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. లేకపోతే రక్తపోటు రీడింగ్‌లు తప్పు కావచ్చు. అదేవిధంగా బీపీ పరికరంతో రక్తపోటును కొలిచేటప్పుడు చేయి గుండె స్థాయిలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. అలాగే బీపీని తనిఖీ చేస్తున్నప్పుడు చేయిని ఒడిలో పెట్టడం, చేయి కింద లేకపోవడం, చేయిని కిందికి వేలాడదీయడం వంటి తప్పులు బీపీ రీడింగ్‌లో సగటున 6.5 పాయింట్లు జరుగుతాయి. కాబట్టి రక్తపోటు పరీక్ష తీసుకునేటప్పుడు సరిగ్గా కూర్చోండి. కొన్ని ఇతర జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. 

ఇది కూడా చదవండి: షుగర్‌ ఉన్నవారికి అరటి పువ్వుతో కలిగే ప్రయోజనాలు

ముందుగా బీపీ పరికర పట్టీ చేతికి సరైన సైజులో ఉందని నిర్ధారించుకోండి. అలాగే ఆ పట్టీని డ్రెస్‌కి వేయకపోతే మంచిది. కూర్చునే స్థానం సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి. ముఖ్యంగా పాదాలు నేలను తాకాలి. వెనుక భాగం కుర్చీ వెనుక భాగానికి ఆనించి ఉండాలి. కాళ్లు చాపి కూర్చోవద్దు. పరీక్ష కోసం చాచిన చేయి గుండె స్థాయిలో ఉందని నిర్ధారించుకోండి. దానికోసం చేతిని డెస్క్ లేదా టేబుల్ మీద ఉంచాలి. రక్తపోటును కొలిచేటప్పుడు మాట్లాడటం సరికాదు. ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిపుణులు పరీక్షకు ముందు కనీసం 5 నిమిషాలు కూర్చోవాలని సలహా ఇస్తారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: 2021లో పెళ్లి.. ఆగని వేధింపులు.. భార్య సూసైడ్!

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral News: పెళ్లి కూతురుకు రూ.55 వేలు, టీవీ, వంట సెట్.. సర్కార్ సంచలన కొత్త స్కీమ్.. వివరాలివే!

పెళ్లి చేసుకునే పేద ఆడపిల్లలకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన పథకం తీసుకొచ్చింది. 'సీఎం కన్యా వివాహ యోజన'లో భాగంగా రూ.55వేలు అందిస్తోంది. వీటితోపాటు టీవీ, స్టవ్, ఫ్యాన్, మంచం తదితర వస్తువులను ఇస్తోంది. ప్రభుత్వమే సామూహిక వివాహ వేడుకలు నిర్వహిస్తుంది.

New Update
madya pradesh

Madhya Pradesh govt launches sensational scheme for poor girls marriage

Viral News: పెళ్లి చేసుకునే ఆడపిల్లలకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన స్కీమ్ తీసుకొచ్చింది. 'ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన'లో భాగంగా రూ.55వేలు, 32అంగుళాల కలర్ టీవీ, స్టవ్, ఫ్యాన్, మంచం, అల్మారా వివాహ సహాయంగా అందిస్తోంది. ప్రభుత్వమే సామూహిక వివాహ వేడుకలను నిర్వహిస్తుంది. అయితే ఇందుకోసం ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి అర్హులెవరు అనే అంశాలు ఇలా ఉన్నాయి. 

పేద కుటుంబాలకు గౌరవంగా..

2006లో ప్రారంభించిన ఈ పథకం ఆడపిల్లలుగల పేద కుటుంబాలు గౌరవంగా పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. ఇందులో కేవలం డబ్బు మాత్రమే కాదు ఇతర ఖర్చులను తగ్గించేందుకు పెళ్లి వస్తువులను కొనిపెడుతుంది. కలర్ టీవీ, స్టవ్, ఫ్యాన్, మంచం, అల్మారా తదితర వస్తువులను పెళ్లి వరకట్నంలో అందిస్తుంది. ఇది తమకెంతో భారాన్ని తగ్గిస్తుందని పేద పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వస్తువుల లిస్ట్:

LPG కనెక్షన్ + స్టవ్.
32 అంగుళాల కలర్ టీవీ.
స్టీల్ అల్మారా, మంచం, ప్రెషర్ కుక్కర్.
గోడ గడియారం, డైనింగ్ టేబుల్.
వధువు బట్టలు, ఇతర అవసరమైన వస్తువులు.

ఎవరికి వర్తిస్తుంది?

అమ్మాయి మధ్యప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
అమ్మాయి కనీస వయస్సు 18 సంవత్సరాలు.
అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు.
సామూహిక వివాహంలో మాత్రమే వివాహం తప్పనిసరి. 
సొంత వివాహానికి చెల్లదు.
విడాకులు తీసుకున్న మహిళలు కూడా అర్హులు (సర్టిఫికేట్ అవసరం).
వివాహానికి కనీసం 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

సమీపంలోని నాగర్ నిగమ్/పంచాయతీ కార్యాలయం నుండి ఫారమ్ తీసుకోవాలి.
సరైన సమాచారం, ఇతర స్థానిక ఫ్రూఫ్ పత్రాలతో ఫారమ్ నింపాలి.
స్థానిక అధికారి ధృవీకరణ చేస్తారు. 
షెడ్యూల్ చేసిన తేదీన సామూహిక వివాహంతోపాటు స్కీమ్ ప్రయోజనాల పంపిణీ.

అవసరమైన పత్రాలు:

వధూవరుల ఆధార్ కార్డు.
జనన ధృవీకరణ పత్రం.
కుల ధృవీకరణ పత్రం.
పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
విడాకుల ధృవీకరణ పత్రం.
అమ్మాయి పేరు మీద బ్యాంకు ఖాతా.
రిజిస్టర్డ్ శ్రామిక్ కార్డ్ (ఏదైనా ఉంటే)

 

Advertisment
Advertisment