/rtv/media/media_files/2025/05/03/Q3mYxq1KOlup3g2cHKU4.jpg)
Mango Juice
వేసవి వచ్చిందంటే చాలు.. అందరూ కూడా మామిడి పండ్లు ఎక్కువగా తింటారు. మామిడి ప్రియులు అయితే ఎక్కువగా జ్యూస్ తాగుతుంటారు. వేసవిలో ఎక్కువగా మ్యాంగో జ్యూస్ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Hyderabad Theft Incident: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!
మధుమేహం
వేసవిలో ఎక్కువగా మామిడి జ్యూస్ తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మితంగా మాత్రమే వేసవిలో మాంగో జ్యూస్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
అలెర్జీ
కొందరికి మ్యాంగో జ్యూస్ వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే జ్యూస్లో ఎక్కువగా పాలఉత్పత్తులు వాడుతారు. ఇవి చర్మంపై దద్దుర్లు, దురద, వాపు సమస్యలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు
ఊబకాయం
సాధారణంగా మామిడి పండ్లు తీపిగా ఉంటాయి. దీనికి తోడు ఇందులో పాలు, చక్కెర వంటివి కలుపుతారు. వీటివల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు
ఎక్కువగా మ్యాంగో తీసుకుంటే బాడీకి వేడి చేస్తుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా మామిడి పండ్లు తీసుకుంటే.. మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఈ సీజన్లోనే లభిస్తాయని మామిడి పండ్లను ఎక్కువగా తీసుకోవద్దు.
ఇది కూడా చూడండి: Hyderabad School Buses: డేంజర్ జోన్లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
mangos | banganapalle-mangos | juice | health-issues | latest-telugu-news