అందరూ ఎదురు చూసే సంక్రాంతి పండుగ వస్తోంది. సాధారణంగా సంక్రాంతి పండుగను జనవరి 13 లేదా 14వ తేదీన జరుపుకుంటారు. అయితే దాదాపుగా మూడేళ్ల తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి రాబోతోంది. అయితే ఈ సమయంలో 19 ఏళ్ల తర్వాత మరో అరుదైన ఘటన వస్తోంది. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగతో పాటు భౌమ పుష్య యోగం కూడా రాబోతుంది. ఈ యోగంలో ఏ పని తలపెట్టిన కూడా అంతా విజయమే లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది కూడా చూడండి: Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా! మూడేళ్ల క్రితం జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకున్నారు. మళ్లీ ఇప్పుడు అదే తేదీన పండుగను జరుపుకుంటున్నారు. జనవరి 14వ తేదీన ఉదయం 8.56 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఏవైనా శుభ కార్యాలు తలపెట్టిన అన్నింటా విజయమే లభిస్తుంది. నర్మదా, గంగా వంటి పుణ్య నదుల్లో కూడా ఈ సమయంలోనే స్నానం చేస్తారు. ఇది కూడా చూడండి: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా? జీవితం అంతా కూడా మధురంగా సాగుతుందని.. అలాగే ఆలయాల్లో బ్రాహ్మణులకు నువ్వులు, బెల్లం, కిచిడి, బట్టలు, దుప్పట్లు వంటి వాటిని దానం చేయాలి. మకర సంక్రాంతి రోజున కొందరు నువ్వులు, బెల్లం వంటివి తింటారు. వీటిని తినడం వల్ల జీవితంలో ఉన్న చేదు అంతా తొలగిపోయి.. అంతా మధురంగా సాగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే మకర సంక్రాంతి రోజు కొత్త పనులు ప్రారంభించాలని పండితులు అంటున్నారు. ఇది కూడా చూడండి:Sankranthi Rangavalli 2025: సంక్రాంతికి సింపుల్ గా సూపర్ ముగ్గు.. 5 నిమిషాల్లోనే వేయిండిలా! ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!