/rtv/media/media_files/2025/02/07/dV09CYeUVjUiEkbUuqcs.jpg)
mango pickle
సాధారణంగా భారతీయ ఆహారంలో పచ్చళ్లు చాలా ముఖ్యమైన భాగం. ప్లేట్ లో ఎన్ని రకాల కూరగాయలు (Vegetables) ఉన్నప్పటికీ ఒక పచ్చడి మాత్రం తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని పిచ్చిగా ఇష్టపడతారు. ఊరగాయలను పరిమిత పరిమాణంలో తింటే ఎటువంటి సమస్య లేకపోయినప్పటికీ, వీటిలోని అధిక సోడియం, నూనె, పులుపు కారణంగా ఆరోగ్యానికి హానికరమని చెబుతారు. ముఖ్యంగా వ్యాధులతో బాధపడేవారు పచ్చళ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. ఆ వ్యాధులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఎవరు ఊరగాయలు తినకూడదు
కాలేయం, మూత్రపిండాల సమస్యలు..
కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఊరగాయలు తినాలనుకుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. వీటిలోని అధిక సోడియం(ఉప్పు) కంటెంట్ మూత్రపిండాలు, కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది. అంతేకాదు అధిక ఉప్పు, కారం శరీరంలో వాటర్ రిటెన్షన్ ను పెంచుతుంది. ఇది శరీరంలో వాపు ప్రమాదానికి దారితీస్తుంది.
Also Read: Saif Ali khan Attack: సైఫ్ ను పొడిచింది వాడే.. పోలీసుల ముందే గుర్తు పట్టిన పని మనుషులు!
జీర్ణ సమస్యలు
మలబద్దకం, గ్యాస్, అజీర్ణం, కడుపు మంట ఉన్నవారు ఊరగాయలకు దూరంగా ఉండాలని వైద్యుల సూచిస్తున్నారు. అలాగే ఊరగాయాలలోని ఉప్పు, మసాలాలు, కారం జీర్ణమవడానికి కష్టంగా ఉంటుంది. కావున ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఊరగాయలు తక్కువగా తినాలి.
Also Read : అధిక రక్తపోటు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి
అధిక రక్తపోటు
అధిక రక్తపోటు (Blood Pressure) ఉన్నవారు ఊరగాయలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే సహజంగా ఊరగాయల తయారీలో ఉప్పు, నూనెలు అధిక మొత్తంలో ఉపయోగిస్తారు. ఇవి రెండూ కూడా రక్తపోటు సమస్యను మరింత పెంచుతాయి. వీటితో పాటు ఊరగాయల్లో ఉపయోగించే పలు మసాలాలు బీపీ రోగులకు మంచివి కావు అని నిపుణుల సలహా.