/rtv/media/media_files/2025/01/17/4WhP6GrmHeKqg4NX4Kud.jpg)
saif ali khan attack
Saif Ali khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించి గతనెలలో బంగ్లాదేశ్ కి చెందిన షరీఫుల్ ఇస్లాం షాజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ అలియాస్ విజయ్ దాస్ అనే వ్యక్తిని నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం షరీఫుల్ ఆర్థర్ రోడ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
Also Read: Thandel : తండేల్ ఓటీటీ రిలీజ్ అందులోనే..? ఎంత ధరకు అమ్ముడుపోయాయంటే!
నిందితుడిని కన్ఫర్మ్ చేసిన పోలీసులు
అయితే తాజాగా ముంబై పోలీసులు ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్ తెలిపారు. సైఫ్ పై దాడి చేసింది షరీఫులే అని తేల్చారు. బుధవారం ఆర్థర్ రోడ్ జైలులో గుర్తింపు పరేడ్ (Identity parade) నిర్వహించగా.. అందులో సైఫ్ ఇంటి పనిమనుషులు, ప్రధాన సాక్షులు ఎలియమ్మ ఫిలిప్ (56), జూను పాల్గొన్నారు. ఐడెంటిటీ పరేడ్ లో నిందితులను పరిశీలించిన ప్రధాన సాక్షి ఎలియమ్మ ఫిలిప్ సైఫ్ పై దాడి చేసింది షరీఫుల్ అని గుర్తించారు. ఎలియమ్మ ఫిలిప్ ఈ కేసులో కీలక సాక్షి.. నిందితుడు ఆమె పై కూడా దాడి చేశాడు. ఒక తహసీల్దార్, ఐదుగురు అధికారుల సమక్షంలో గుర్తింపు పరేడ్ నిర్వహించబడిందని పోలీసులు తెలిపారు.
అయితే మొదట్లో సీసీ కెమెరాలో ఉన్న వ్యక్తి వేరు, అరెస్ట్ చేసిన వ్యక్తి వేరు అని రకరకాల వాదనలు వినిపించాయి. కానీ అరెస్ట్ చేసిన వ్యక్తి మొహం, సైఫ్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న ముఖం సరిపోలుతున్నట్లు ఫేస్ డిటెక్షన్ టెస్ట్ లో తేలిందని పోలీసులు తెలిపారు.
జనవరి 16న ..
జనవరి 16న 12వ అంతస్తులోని సైఫ్ అలీఖాన్ అపార్ట్మెంట్ లోకి చోరీకి వెళ్లిన షరీఫుల్ ఆయనను ఆరుసార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. ఆ తర్వాత మూడు రోజులకు థానే ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడి తర్వాత తీవ్ర గాయాలతో లీలావతి ఆసుపత్రిలో చేరిన సైఫ్ 10రోజుల పాటు చికిత్స పొందారు. జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు.