/rtv/media/media_files/2025/05/15/RVcA75vCwnyk2YtSfp6c.jpg)
colorful juicy fruits
Juicy Fruits: వేసవికాలం వస్తే తాపం పెరిగి, శరీరానికి వేడి అధికమవుతుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్లో ఈ కాలంలో అందుబాటులో ఉండే రంగు రంగుల జ్యూసీ పండ్లలో పీచు పండు ఒకటి. ఇది తీపిగా ఉండటమే కాక ఎన్నో పోషక విలువలు కలిగి ఉండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పీచు పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఇ, కె వంటి విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఈ పండు శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన జీవక్రియ..
పీచు పండ్లలో 85-90 శాతం నీరు ఉండటంతో వేడి కాలంలో నిర్జలీకరణ సమస్యను నివారిస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణవ్యవస్థకు బాగా పనిచేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు తోడ్పడుతుంది. ప్రతి రోజు ఒక పీచు పండును తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం చేసి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది. అలాగే సూర్య కిరణాల వల్ల కలిగే హానిని తగ్గించి చర్మాన్ని రక్షిస్తుంది. పీచు పండ్లలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును సమతుల్యం చేసే గుణం ఉంది.
ఇది కూడా చదవండి: సహజంగా జీవక్రియను మెరుగుపర్చే రహస్య శక్తి
ఇందులో ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గే ప్రక్రియలో సహాయపడతాయి. ఇవి తిన్న తర్వాత కడుపు ఎక్కువసేపు నిండినట్లు అనిపిస్తుంది. ఫలితంగా అతిగా తినే అలవాటు తగ్గిపోతుంది. అయితే పీచులను అధికంగా తినడం వల్ల కొంతమంది వద్ద గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల పీచులను బాగా కడిగిన తర్వాత మాత్రమే తినాలి. తద్వారా ఫలంపై ఉండే హానికరమైన పురుగుమందులు తొలగిపోతాయి. వేసవిలో ఈ ఆరోగ్యకరమైన పండును తింటే శరీరానికి చల్లదనం, ఆరోగ్యం సులభంగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: తల మసాజ్ వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)