/rtv/media/media_files/2025/06/08/CPzewZ5RHLu156cbKNVq.jpg)
Ukraine drones attack on Moscow forces airport closure, Russia says
రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. తమ బలగాలు తొమ్మిది డ్రోన్లను కూల్చేశాయని పేర్కొన్నారు. తులా ప్రాంతంలోని అజోట్ కెమికల్ ప్లాంట్పై డ్రోన్లు దాడి చేయడంతో.. మంటలు చెలరేగాయాని తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ దాడులు కొనసాగుతుండటం వల్ల ముందస్తు అప్రమత్తతతో వ్నుకోవో, డొమోడెడోవో ఎయిర్పోర్టులను మూసివేసినట్లు చెప్పారు.
Also Read: భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన మహువా మెయిత్రా.. వీడియో వైరల్
Ukraine Drones Attack On Moscow
దీనివల్ల పలు విమానాల సర్వీసులు రద్దయ్యాయని.. మరికొన్నింటిని ఇతర ఎయిర్పోర్టులకు మళ్లించామని పేర్కొన్నారు. అయితే ఈ దాడుల వల్ల ఎంత నష్టం జరిగింది అనే అంశాలను మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత రష్యా కూడా ఉక్రెయిన్పై ప్రతిదాడులకు దిగడంతో పలు ప్రాంతాల్లోని నివాస భవనాలు ధ్వంసమైనట్లు సమాచారం.
Also Read: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యం.. కొనసాగుతున్న భారత్, మంగోలియా సంయుక్త మిలటరీ డ్రిల్..
ఇదిలాఉండగా గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోంది. కాల్పుల విరమణ పలికేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం ముగించి శాంతి నెలకొల్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు యుద్ధాన్ని ఆపేందుకు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇరుదేశాల మధ్య దాడులు జరగడం కలకలం రేపుతోంది. ఇటీవల ఉక్రెయిన్ 117 డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడి.. 41 యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రష్యా 400 లకు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది.
Also Read: ట్రంప్ పై తిరుగుబాటు.. ఆందోళనకారులపై ఫైరింగ్.. అమెరికాలో హై టెన్షన్
Also Read: కరోనా కలకలం.. 6 వేలు దాటిన కేసులు, 65 మంది మృతి
telugu-news | rtv-news | ukraine | russia | russia-ukraine-war