Iran-Israel War : ట్రంప్ వార్నింగ్...దాడులు ఆపేసిన ఇజ్రాయెల్

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే  ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులు కొనసాగించింది. దీనిపై ట్రంప్ సీరియస్ అయ్యారు. ట్రంప్‌ ఆదేశాలతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్‌ దాడులు ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది.

New Update
Iran state TV says Israeli strike killed nuclear scientist

Iran state TV says Israeli strike killed nuclear scientist

Iran-Israel War:

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే  ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడులు కొనసాగించింది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయ్యారు. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఉందని.. సైనికులను వెనక్కి రప్పించాలంటూ ఇజ్రాయెల్ ను ఆదేశించారు. ట్రంప్‌ ఆదేశాలతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్‌ దాడులు చేసినట్టు ఒప్పుకోవడంతో పాటు తమ అధినేత నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడిన తర్వాత దాడులు ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది.

Also Read: వందేభారత్‌ రైలులో దారుణం..సీటు మారలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే

ఇక మీదట మరో దాడి చేయబోమని వెల్లడించింది. ఇజ్రాయెల్‌ ప్రకటనపై స్పందించిన  ట్రంప్  మాట్లాడుతూ 12 రోజులుగా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు. ‘సీజ్ ఫైర్ ఒప్పందం చేసిన తర్వాత ఇరాన్ మాపై మూడు చోట్ల దాడులు చేసింది. అందుకే మేం ఇరాన్ రాడార్ వ్యవస్థలపై దాడులు చేశాం’ అంటూ ఇజ్రాయెల్ వెల్లడించింది.అయితే దీనిపై స్పందించిన ఇరాన్‌ ఒప్పందాన్ని తాము ఉల్లంఘించామని ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను  ఖండించింది. తాము అస్సలు ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. సీజ్ ఫైర్ ఒప్పందం కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు రెండు దేశాలు ప్రకటించాయి. దీంతో రెండు దేశాల మధ్య గత 12 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతకు తెరపడినట్లయింది.

Also Read: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!


ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ట్రంప్‌ ప్రకటించారు. దీన్ని  ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్‌- ఇరాన్‌ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ అనంతరం పరస్పరం దాడులు చేసుకోవడంపై ఫైర్ అయ్యారు. ఇరు దేశాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయన్నారు. ఈ క్రమంలో మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ హెచ్చరించారు. “ఇజ్రాయెల్‌.. ఆ బాంబులను వేయొద్దు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే. మీ పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించండి” అని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారి ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇజ్రాయెల్‌ తన సైన్యాన్ని వెనక్కు పిలిచింది.

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

 

Advertisment
Advertisment
తాజా కథనాలు