Pak-Afghan: తాలిబన్ల ఎదురు కాల్పులు.. 25 మంది పాక్ సైనికులు మృతి

ఆఫ్గానిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్‌ సరిహద్దు ప్రాంతంలోని కుర్రమ్‌పై ఆఫ్గానిస్థాన్‌ దాడులకు పాల్పడింది. ఈ ఎదురు కాల్పుల్లో  25 మంది పాక్ సైనికులు మృతి చెందగా.. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
pakisthan

pakisthan

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది. పాక్‌ సరిహద్దు ప్రాంతంలోని కుర్రమ్‌పై తాలిబన్లు మెరుపు దాడులు చేశారు. ఈ నెల 24న ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ దాడులు చేయడంతో ప్రతీకారంగా తాలిబన్లు దాడులు చేసింది. ఈ ఎదురు కాల్పుల్లో  25 మంది పాక్ సైనికులు మృతి చెందగా.. మరో 200 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే 6 పాక్ పోస్టులను తాలిబన్లు ధ్వంసం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ కూడా తాలిబన్ల 40 ఔట్ పోస్టులను స్వాధీనం చేసుకుంది. 

ఇది కూడా చూడండి: Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి

దాడులు ప్రారంభించిన పాకిస్థాన్..

ఇదిలా ఉండగా.. ఇటీవల ఆఫ్గానిస్తాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపుగా 46 మంది మరణించారు. పాకిస్థాన్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆఫ్గానిస్తాన్ దాడులు చేసింది. అయితే ఈ దాడులను మొదట పాకిస్థాన్ ప్రారంభించింది. తాలిబన్లు ఉగ్రవాదులను తయారు చేస్తోందని.. పాకిస్థాన్ ఆరోపించింది. ఈ క్రమంలోనే మొదట పాకిస్థాన్ దాడులు చేయగా.. తాలిబన్లు ఎదురు కాల్పలు జరిపారు. మరి ఈ దాడులు ఎంత వరకు వెళ్తాయనేది చూడాలి. 

ఇది కూడా చూడండి: Manmohan Singh: మాజీ ప్రధాని అస్థికల నిమజ్జనం.. ఎక్కడ చేశారంటే?

ఇది కూడా చూడండి: Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

ఇది కూడా చూడండి:  Rave Party: తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు