/rtv/media/media_files/2024/12/27/obHS6GUhUz2mubVFjgor.jpg)
Manmohan singh
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఢిల్లీలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్య క్రియలను పూర్తిచేశారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన అస్థికలను ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు. మజ్ను కా తిలా గురుద్వారా సమీపంలో ఉన్న అష్ట్ ఘాట్ వద్ద సిక్కు సంప్రదాయాల ప్రకారం అస్థికలను కలిపారు. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్, అతని ముగ్గురు కుమార్తెలు ఉపిందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్ సింగ్తో పాటు మరికొందరు బంధువులు కలిసి నిమజ్జనం చేశారు.
ఇది కూడా చూడండి: Ap: జనసేనలోకి తమ్మినేని సీతారాం..క్లారిటీ ఇచ్చేసారుగా..!
आज भारत मां के सपूत और देश के पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह जी की अस्थियां पूरे विधि-विधान के साथ मजनू का टीला स्थित गुरुद्वारे के पास यमुना घाट पर विसर्जित की गईं।
— Congress (@INCIndia) December 29, 2024
हम सभी मनमोहन सिंह जी की देश सेवा, समर्पण और उनकी सहजता को हमेशा याद रखेंगे।
सादर नमन 🙏
📍 नई दिल्ली pic.twitter.com/ag7npL5Ctz
ఇది కూడా చూడండి: ప్రశ్నపత్రం లీకేజీ.. అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీ
ప్రభుత్వ అధికార లాంఛనాలతో..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స తీసుకుంటూనే తుదిశ్వాస విడిచారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో శనివారం ఆయనకు అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.
ఇది కూడా చూడండి: Rythu Bharosa: రైతు భరోసాపై భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్
ఇది కూడా చూడండి: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై