Suicide Bomb: చర్చిలో ఆత్మహుతి దాడి.. 20మంది మృతి

సిరియాలోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది చనిపోయారు. 53 మంది గాయాలపాలయ్యారు. రాజధాని డమాస్కస్‌ సమీపంలోని వెలాలో మార్‌ ఎలియాస్‌ చర్చిలో దుర్ఘటన జరిగింది.

New Update
Suicide Bomber

సిరియాలోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది చనిపోయారు. 53 మంది గాయాలపాలయ్యారు. రాజధాని డమాస్కస్‌ సమీపంలోని వెలాలో మార్‌ ఎలియాస్‌ చర్చిలో దుర్ఘటన జరిగింది. కిక్కిరిసిన చర్చిలో ప్రజలు ప్రార్థనలు చేస్తుండగా ఒక దుండగుడు తనను తాను బాంబులతో బ్లాస్ట్ చేసుకున్నాడు. చనిపోయిన వారిలో చిన్నారులు సైతం ఉన్నారు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే దాడి చేసినట్లు ఇప్పటి వరకు ప్రకటించుకోలేదు.

Also Read :  ఇక భారత్‌కు కష్టకాలమే.. భారీగా పెరిగిన చమురు ధరలు, పడిపోయిన స్టాక్ మార్కెట్లు

Suicide Bomb In Syria

Also Read :  అత్త..భార్య..ఓ బ్యాంకు మేనేజర్...సర్వేయర్ హత్యలో కొత్త కోణం

ఇస్లామిక్‌ స్టేట్‌కు చెందిన ఓ ఉగ్రవాది మొదట చర్చిలోకి వచ్చి కాల్పులు జరిపాడని, తర్వాత ఆత్మహుతి దాడికి పాల్పడినట్లు సిరియా అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ దాడిని సిరియా సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి హమ్జా మొస్తాఫా ఖండించారు. దీనిని పిరికిపంద దాడిగా అభివర్ణించారు. దుండగుడు చర్చిలో గ్రెనేడ్‌ విసిరేసినట్లు చర్చి బిషప్‌ తెలిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని తాను చూశానని, అతనివెంట మరో ఇద్దరు సైతం వచ్చారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. 

Also Read :  ఓటీటీలో థ్రిల్‌ పంచేలా.. ఈ వారం సినిమాలు/సిరీస్‌లివే!

Also Read :  భర్తను కాదని.. మేనల్లుడితో మహిళ జంప్..

 

latest-telugu-news | syria news | telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు