Crime News: భర్తను కాదని.. మేనల్లుడితో మహిళ జంప్.. కట్ చేస్తే! (వీడియో)

బీహార్‌లోని జాముయ్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్త విశాల్, మూడేళ్ల కుమార్తెను విడిచిపెట్టి.. భర్త మేనల్లుడు సచిన్‌తో జంప్ అయింది. ఐదు రోజుల తర్వాత ఊరికి వచ్చి ఓ ఆలయంలో వివాహం చేసుకుంది.

New Update
woman married her nephew video viral

woman married her nephew video viral

బీహార్‌లోని జాముయ్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్త, మూడేళ్ల కుమార్తెను విడిచిపెట్టి మేనల్లుడు సచిన్ దూబేను ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. పూర్తి వివరాల్లో వెళితే.. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

భర్త మేనల్లుడితో మహిల జంప్

పాట్నా నివాసి అయిన ఆయుషి, కొన్ని సంవత్సరాల క్రితం సిక్రియ గ్రామానికి చెందిన విశాల్ దుబేను వివాహం చేసుకుంది. ఇద్దరికీ మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే గత సంవత్సరం నుండి ఆయుషి తన భర్త మేనల్లుడు సచిన్‌తో ప్రేమలో పడింది. అతడు ఆయుషి పొరుగింట్లో నివశిస్తుండటంతో ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. దీంతో వారిద్దరి మధ్య సంబంధం మరింత పెరిగింది. 

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

ఈ విషయం కాస్త ఆయుషి భర్త విశాల్ దూబేకు తెలిసింది. అప్పటి నుంచి భార్య భర్తల మధ్య తరచూ వివాదాలు మొదలయ్యాయి. ఎప్పటికప్పుడే గొడవ పడేవారు. అది కాస్త పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు వెళ్లింది. విశాల్ దూబే విడాకుల పిటిషన్ కూడా దాఖలు చేశాడు. కానీ విడాకుల ప్రక్రియ పూర్తి కాకముందే ఆయుషి తన ప్రియుడు సచిన్‌ దూబేతో ఇంటి నుండి పారిపోయింది. 

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

అనంతరం ఐదు రోజుల తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చి గ్రామంలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆయుషి సంచలన విషయాలు చెప్పింది. తన భర్త తనను హింసిస్తున్నాడని.. అందుకే సచిన్‌ను తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నానని తెలిపింది. తన కుమార్తె తండ్రితోనే ఉంటుందని, ఇకపై తన జీవితాన్ని సచిన్‌తోనే గడుపుతానని ఆమె స్పష్టం చేసింది. .

Advertisment
Advertisment
తాజా కథనాలు