Pakistan PM Shabaz Sharif: ఇది కూడా కాపీయేనా.. మోదీని ఫాలో అయిన పాక్ ప్రధాని... ఆర్మీ దగ్గర డ్రామా

పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..భారత ప్రధాని మోదీని మొదటి నుంచీ కాపీ కొడుతూ వస్తున్నారు. ఇప్పుడు వార్ ముగిసిన తర్వాత కూడా మోదీలాగే పాక్ ఆర్మీని కలిసి.. ట్యాంక్ మీద ఎక్కి మరీ డ్రామా చేశారు. తాను ఎప్పటికైనా పాక్ సైన్యం ధైర్యం గురించి పుస్తకం రాస్తానన్నారు.

author-image
By Manogna alamuru
New Update
pak

Pakistan PM Shabaz Sharif

Pakistan PM Shabaz Sharif: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్...ఈయన మొదటి నుంచి భారత ప్రధాని మోదీ(PM Modi) ఏం చేస్తే అదే తానూ చేస్తూ వస్తున్నాడు. పహల్గాందాడి(Pahalgam Terror Attack) తర్వాత భారత్ ఐదు నిర్ణయాలు ప్రకటిస్తే పాక్ ప్రధాని కూడా అదే చేశారు. వార్ లో భారత్ ఎలాంటి అడుగులు వేస్తే వాళ్ళు కూడా అవే నిర్ణయాలు తీసుకుంటూ గుడ్డిగా ఫాలో అయిపోయారు. ఇప్పుడు తాజాగా కాల్పులు విరమణ తర్వాత ప్రధాని మోదీ ఆర్మీ భారత ఆర్మీని(Indian Army) కలిసి వారిపోరాటపటిమను కొనియాడారు. ఇప్పుడు అదే తరహాలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ ఆర్మీని కలిశారు. అక్కడ యుద్ధ  ట్యాంకు ఎక్కి తమ సైనికులకు సాహసం గురించి ఉపన్యాసాలు దంచారు. అంతేకాదు ఆర్మీఛీఫ్ ఆసిమ్ మునీర్(Pak Army Chief Asim Munir), ఎయిన్ మార్షల్ బాబర్ వీపును తడుతూ డ్రామాలు చేశారు. తాన ప్రధాని పదవి ముగిశాక ఒక పుస్తకం రాస్తానని..అందులో పాక్ సైనికుల ధైర్యం గురించి ప్రస్తావిస్తానంటూ బీరాలు పలికారు షెహబాజ్.

Also Read: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్

Also Read: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

ఏం డ్రామాలు చేశారురా నాయనా..

సియాల్‌కోట్‌లోని పస్రూర్ ఆర్మీ క్యాంప్‌ పై భారత ఆర్మీ అటాక్ చేసింది. అక్కడి రాడార్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. పస్రూర్ ఆర్మీ కంటోన్మెంట్‌కు టోపీ ధరించి చేరుకున్న ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్.. అక్కడ ఉన్న ఒక కంటోన్మెంట్‌లోకి ఎక్కారు. ట్యాంక్ పై నుండే తమ ఆర్మీని అడ్రస్ చేశారు. ఈ ట్యాంక్ వెనుక ఒక పోస్టర్ అతికించబడింది. ఈ పోస్టర్‌లో భారత వైమానిక దాడిలో మరణించిన వారి చిత్రాలు ఉన్నాయి. ఈ ట్యాంక్ గడ్డితో కప్పబడి ఉంది. దానిని యుద్ధం లాంటి పరిస్థితిలో ఉన్నట్లుగా పరిగణించారు. షాబాజ్ షరీఫ్ ఇనుప మెట్ల ద్వారా ఈ ట్యాంక్ చేరుకున్నాడు. తానే యుద్ధం చేస్తున్నట్టు ఫీల్ అయిపోయారు. పాక్ ప్రధానితో పాటూ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, పాకిస్తాన్ వైమానిక దళ అధిపతి, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇతర సైనిక అధికారులు ఉన్నారు. ప్రధాని షెహబాజ్ తన సైన్యాన్ని విపరీతం పొగిడేశారు. భారత్ దాడుల వలన జరిగిన నష్టాన్ని మాట్లాడకుండా..శత్రువులు పెద్దవాళ్లు అయినా మీరు ఎదుర్కొన్నారంటూ చెప్పుకొచ్చారు. ఎప్పుడైనా తనకు అవకాశం దొరికితే పాకిస్తాన్ సైన్యం ధైర్యసాహసాల గురించి పుస్తకం రాస్తానంటూ గొప్పలు చెప్పారు. 

Also Read: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

 

today-latest-news-in-telugu | PAK Pm Shahbaz Sharif | army

Also Read: Manipur: మణిపూర్ లో కాల్పులు ..10 మంది మిలిటెంట్లు హతం

Advertisment
Advertisment
తాజా కథనాలు