/rtv/media/media_files/2025/02/11/9Zs7k7uHJvSRiLRwaLED.jpg)
PM Modi At Paris Ai Summit
ఏఐ మెగా ఈవెంట్ (AI Mega Event) కు ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదిక అయింది. తొంభై దేశాలు పాల్గొంటున్న ఈ సమ్మిట్ లో భారత ప్రధాని మోదీ (PM Modi) కూడా పాల్గొంటున్నారు. దీని కోసం ఆయన ఇప్పటికే పారిస్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ప్రధాని మోదీ ఇక్కడ జరిగే AI సమ్మిట్కు సహ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమ్మిట్ లో ఏఐ కొత్త పోకడలు, పురోగతిలను చర్చించనున్నారు. దాంతో పాటూ ప్రపంచ ఏఐ కోసం మార్గదర్శకాలను తయారు చేయనున్నారు. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమల్లో ఏఐ వాడకం మీద అవగాహన ఏర్పడనుంది. దాంతో పాటూ ఈ టెక్నాలజీని ఇంకెంత బాగా ఉపయోగించుకోవచ్చనేది తెలియనుంది.
Also Read : ఏంటీ నిజమా.. రూ. 200 నోటును బ్యాన్ చేస్తున్నారా.. ఆర్బీఐ కీలక ప్రకటన!
భారత్ కు ఎందుకు ముఖ్యం..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏఐను చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఏఐను సమర్ధవంతంగా ఉపయోగించకుంటుకున్న దేశాల్లో భారత దేశం (India) నాల్గవ స్థానంలో ఉంది. ఇప్పుడు పారిస్ లో జరుగుతున్న సమ్మిట్ కు కూడా ప్రధాని మోదీ సహా అధ్యక్షుడిగా ఉంటున్నారు. భారతదేశంలో పెద్ద కంపెనీలలో 70 శాతం ఏఐను వినియోగిస్తున్నారు. దీనిని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారు. ఏఐ ద్వారా మానవాళికి మంచి చేయడమే భారతదేశం లక్ష్యమని మోదీ తెలిపారు. దాని కోసమే ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా నిరోధించాలనే లక్ష్యంతో ముదుగు వెళుతున్నామని చెప్పారు. దీని కోసమే ఆయన ఇప్పుడు పారిస్ వెళ్ళినట్టు చెబుతున్నారు. దీని తరువాత మోదీ నేరుగా అమెరికా వెళ్ళనున్నారు.
Also Read : లంపీ స్కిన్ వ్యాధి - టీకా కనుగొన్న భారత్ బయోటెక్
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా.. 55 మంది స్పాట్!
Welcome to Paris, my friend @NarendraModi! Nice to meet you dear @VP Vance! Welcome to all our partners for the AI Action Summit.
— Emmanuel Macron (@EmmanuelMacron) February 10, 2025
Let’s get to work! pic.twitter.com/yatkrVYv9x
Also Read: ఓపెన్ ఏఐ కు భారీ ఆఫర్ ఇచ్చిన మస్క్...మీరే ఎక్స్ ను అమ్మండన్న శామ్ వాల్టన్