/rtv/media/media_files/2025/02/11/XClRD3W0L4hcHeX44TSV.jpg)
lumpy
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి (ఎల్ఎస్డీ) టీకా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి నుంచి రక్షించడానికి ఈ టీకా ఇస్తారు. ఎల్ఎస్డీ వ్యాధితో గత రెండు సంవత్సరాల్లో సుమారు 2 లక్షల పశువులు మృతి చెందాయి. దీంతో భారత్ బయెటెక్ సంస్థ ఈ టీకాను కనిపెట్టింది. ‘బయోలంపివ్యాక్సిన్’ అనే ఈ టీకా మన దేశంలోనే మొదటిది.
దీనికి సీడీఎస్సీఓ (సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నుంచి లైసెన్సు వచ్చినట్లు బయోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది.ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పని చేస్తుందని వివరించింది. దీన్ని ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)లలో విస్తృతంగా పరీక్షించినట్లు తెలిపింది. హిస్సార్లోని ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ అందించిన ఎల్ఎస్డీ వైరస్/ రాంచీ/ 2019 వ్యాక్సిన్ స్ట్రెయిన్తో బయోవెట్ సంస్థ ఈ టీకాను డెవలప్ చేసింది.
Also Read: Up: కుంభమేళా ఎఫెక్ట్..వాయిదా పడుతున్న హైకోర్టు కేసులు!
రెండేళ్లలో 2 లక్షల పశువులు...
ఈ టీకాకు సీడీఎస్సీఓ లైసెన్సు లభించడం, మన దేశంలో పశు సంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఎల్ఎస్డీ వ్యాధి వల్ల మనదేశంలో గత రెండేళ్లలో 2 లక్షల పశువులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇంకొన్ని లక్షల పాడి పశువులు వట్టిపోయాయి. దీంతో ఈ వ్యాధిని నిరోధించడం కోసం ఎల్ఎస్డీ టీకా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇకపై ఈ టీకా కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు.
బయోలంపివ్యాక్సిన్ను వెంటనే విడుదల చేస్తామని కృష్ణ ఎల్ల తెలిపారు. బయోవెట్కు కర్ణాటకలోని మల్లూర్లో ఉన్న యూనిట్లో ఏటా 50 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్ఎస్డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశాలున్నాయని సంస్థ అధికారులు తెలిపారు.
Also Read: Uttarakhand:హీరోయిన్ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!
Also Read: Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...!