LUMPY SKIN VACCINE:లంపీ స్కిన్‌ వ్యాధి - టీకా కనుగొన్న భారత్‌ బయోటెక్‌

పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి వల్ల రెండు సంవత్సరాల్లో సుమారు 2 లక్షల పశువులు మృతి చెందాయి.ఎల్‌ఎస్‌డీ వ్యాధితో గత దీంతో భారత్ బయెటెక్ సంస్థ ఈ టీకాను కనిపెట్టింది. ‘బయోలంపివ్యాక్సిన్‌’ అనే ఈ టీకా మన దేశంలోనే మొదటిది.

New Update
lumpy

lumpy

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అనుబంధ సంస్థ బయోవెట్‌ నుంచి లంపీ స్కిన్‌ వ్యాధి (ఎల్‌ఎస్‌డీ) టీకా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి నుంచి రక్షించడానికి ఈ టీకా ఇస్తారు. ఎల్‌ఎస్‌డీ వ్యాధితో గత రెండు సంవత్సరాల్లో సుమారు  2 లక్షల పశువులు మృతి చెందాయి. దీంతో భారత్ బయెటెక్ సంస్థ ఈ టీకాను కనిపెట్టింది. ‘బయోలంపివ్యాక్సిన్‌’ అనే ఈ టీకా మన దేశంలోనే మొదటిది. 

Also Read:Maha Kumbh Mela: 350 కి.మీ మేర నిలిచిన ట్రాఫిక్‌...గూగుల్‌ మ్యాప్‌ చూసుకుని వెళ్లండంటున్న సీఎం!

దీనికి సీడీఎస్‌సీఓ (సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌) నుంచి లైసెన్సు వచ్చినట్లు బయోవెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్కొంది.ఈ టీకా భద్రమైనదే కాకుండా బాగా పని చేస్తుందని వివరించింది. దీన్ని ఐసీఏఆర్‌-ఎన్‌ఆర్‌సీఈ, ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐవీఆర్‌ఐ)లలో విస్తృతంగా పరీక్షించినట్లు తెలిపింది. హిస్సార్‌లోని ఐసీఏఆర్‌-ఎన్‌ఆర్‌సీఈ అందించిన ఎల్‌ఎస్‌డీ వైరస్‌/ రాంచీ/ 2019 వ్యాక్సిన్‌ స్ట్రెయిన్‌తో బయోవెట్‌ సంస్థ ఈ టీకాను డెవలప్‌ చేసింది.

Also Read: Up: కుంభమేళా ఎఫెక్ట్‌..వాయిదా పడుతున్న హైకోర్టు కేసులు!

రెండేళ్లలో 2 లక్షల పశువులు...

ఈ టీకాకు సీడీఎస్‌సీఓ లైసెన్సు లభించడం, మన దేశంలో పశు సంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్, బయోవెట్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఎల్‌ఎస్‌డీ వ్యాధి వల్ల మనదేశంలో గత రెండేళ్లలో 2 లక్షల పశువులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇంకొన్ని లక్షల పాడి పశువులు వట్టిపోయాయి. దీంతో ఈ వ్యాధిని నిరోధించడం కోసం ఎల్‌ఎస్‌డీ టీకా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇకపై ఈ టీకా కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు.

బయోలంపివ్యాక్సిన్‌ను వెంటనే విడుదల చేస్తామని కృష్ణ ఎల్ల తెలిపారు. బయోవెట్‌కు కర్ణాటకలోని మల్లూర్‌లో ఉన్న యూనిట్​లో ఏటా 50 కోట్ల డోసుల టీకాను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్‌ఎస్‌డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశాలున్నాయని సంస్థ అధికారులు తెలిపారు.

Also Read: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!

Also Read: Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్‌ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు