Iran: ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ మాస్టర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన పాక్ వ్యక్తి... షాకింగ్ న్యూస్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌లను చంపడానికి ఇరానియన్ గూఢచారులు తనను నియమించుకున్నా రని పాకిస్తాన్ ఉగ్రవాది కోర్టులో వెల్లడించాడు. తన కుటుంబాన్నిచంపేస్తామని బెదిరించడం వల్ల తాను అలా చేయాల్సి వచ్చిందని అతను కోర్టుకు చెప్పాడు.

New Update
FotoJet (15)

Iran's master plan to kill Trump.. Pakistani man caught in crossfire

ట్రంప్‌(Donald Trump) ను చంపడానికి ఇరానియన్ గూఢచారులు తనను నియమించుకున్నారని పాకిస్తాన్ ఉగ్రవాది(terrorist) కోర్టులో వెల్లడించడం సంచలనంగా మారింది. నిందితుడైన పాకిస్తానీ(pakistan) ఉగ్రవాది  అమెరికా కోర్టులో నిందితుడు ఇచ్చిన సంచలనాత్మక సాక్ష్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌(joe-biden) లను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరానియన్ గూఢచారులు తనను నియమించుకున్నారని పేర్కొన్నాడు. ఇరానియన్ గూఢచారులు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించడం వల్ల  తాను అలా చేయాల్సి వచ్చిందని అతను కోర్టుకు చెప్పాడు.

అమెరికా(america) నాయకులను హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై అరెస్టయిన ఒక పాకిస్తాన్ వ్యక్తి బుధవారం కోర్టులో ఈ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించడం సంచలనంగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ గూఢచారులు తనను నియమించుకున్నారని ఆ ఉగ్రవాది వివరించాడు. నిందితుడైన ఉగ్రవాది పేరు ఆసిఫ్ మర్చంట్,అతని వయస్సు 47 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారిని రక్షించుకోవడానికి తాను కుట్రలో చేరాల్సి వచ్చిందని అతను కోర్టుకు చెప్పాడు.  నిందితుడు ఆసిఫ్ మర్చంట్ బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో న్యాయమూర్తితో మాట్టాడుతూ, "నాకు వేరే మార్గం లేదు. నా కుటుంబాన్ని బెదిరించారు" అని స్పష్టం చేశారు.

Also Read :  ఒక్క తూటా పేలకుండా అమెరికా ఆట కట్.. ఇరాన్ కు చైనా ప్రొఫెసర్ సలహా ఇదే!

Iran's Master Plan To Kill Trump

కాగా ట్రంప్‌ పై దాడి చేయడం కోసం ఇద్దరు రహస్య FBI ఏజెంట్లకు $5,000 చెల్లించినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన వ్యాపారి గతంలో బ్యాంకర్‌గా పనిచేశాడు, అతను నిర్వహిస్తున్న అరటిపండ్ల వ్యాపారం తీవ్రంగా నష్టాలను చవిచూసింది. దీంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయనను ఏప్రిల్ 2024లో, అతని ఇరానియన్ గూఢచారి హ్యాండ్లింగ్ తనను అమెరికాకు వెళ్లి ఒకరిని హత్య చేయమని ఆదేశించిందని అతను కోర్టుకు చెప్పాడు. "ఆయన ఎవరో నాకు ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ ఆయన మూడు పేర్లను ప్రస్తావించారు: డోనాల్డ్ ట్రంప్, జో బైడెన్, నిక్కీ హేలీ." ఆ సమయంలో, డోనాల్డ్ ట్రంప్,జో బైడెన్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ అభ్యర్థులుగా ఉన్నారు. నిక్కీ హేలీ దక్షిణ కరోలినా మాజీ గవర్నర్. ఆమె ఒక నెల ముందే పోటీ నుండి తప్పుకున్నారు.

కాగా, ఆసిఫ్ మర్చంట్ ఆగస్టు 2024లో అరెస్టు అయ్యాడు. ఉగ్రవాదం , కాంట్రాక్ట్ హత్యల ఆరోపణలతో అతను అరెస్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా తన గూఢచారి హ్యాండ్లింగ్ హత్యను నిర్వహించాలని మరియు బహిర్గతం కాని పత్రాలను దొంగిలించాలని తనను ఆదేశించాడని అతను పేర్కొన్నాడు. కాగా,  అతని నియమించిన వ్యక్తిని మెహర్దాద్ యూసుఫ్ గా గుర్తించారు, ఇతను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సభ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇరాన్‌లో నివసిస్తున్న తన బంధువులపై యూసుఫ్ ఒత్తిడి తెచ్చినందున తాను ఈ కుట్రకు అంగీకరించానని వ్యాపారి చెప్పాడు. యూసఫ్ ఇరాన్‌లోని తన ఇంటికి ఎలాంటి సమాచారం లేకుండానే వచ్చాడని, తమ సమావేశం సమయంలో ఆయుధాన్ని కూడా చూపించాడని అతను పేర్కొన్నాడు. నివేదికల ప్రకారం, నిందితుడు న్యాయమూర్తితో, "నా కుటుంబం ప్రమాదంలో ఉండటంతో  నేను దీన్ని చేయాల్సి వచ్చింది" అని చెప్పినట్లు తెలిసింది. కాగా, జూన్ 2024లో క్వీన్స్‌లోని ఒక బడ్జెట్ హోటల్‌లో జరిగిన సమావేశంలో నిందితుడు మర్చంట్ ఒక రిపబ్లికన్ నాయకుడిని హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు FBI భద్రతా కెమెరాల్లో రికార్డ్ అయింది. తరువాత దాఖలు చేసిన కోర్టు పత్రాల ప్రకారం, ఆ వ్యక్తి డోనాల్డ్ ట్రంప్ అని తేలింది.

Also Read :  'తగ్గేదే లే'.. కీలక వ్యూహాలతో అమెరికాను దెబ్బకొడుతున్న ఇరాన్

Advertisment
తాజా కథనాలు