Iran: ఆపరేషన్ రైజింగ్ లయన్..ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ మృతి..

మిడిల్ ఈస్ట్ మళ్ళీ రగులుతోంది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. రాజధాని టెహ్రాన్ మీద కూడా దాడులు జరిగాయి. ఈ భీకర దాడుల్లో ఇరాన్‌ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.

New Update
iran

Iran Revolutionary Guards Chief Hossein Salami

ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్...ఇరాన్ పై ముందస్తు దాడులను నిర్వహించింది. అమెరికా వద్దని చెబుతన్నా ఇజ్రాయెల్ వినడం లేదు. అందుకే వీటిల్లా తమ ప్రమేయం లేదని అమెరికా చెప్పింది. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇరాన్ రాజధాని శుక్రవారం ఉదయం పేలుళ్ళు వినిపించాయని చెబుతున్నారు.  డజన్ల కొద్దీ దాడులు జరిగాయని తెలుస్తోంది. వీటి తర్వాత టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిలిపివేసింది. దాంతో పాటూ ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్ దేశాలు తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Also Read :  ఈ 4 గాడ్జెట్‌లను విమానంలో తీసుకెళ్తే చాలా డేంజర్.. ప్రాణాలే పోతాయ్!

Also Read :  ‘రాజాసాబ్‌’ టీజర్‌ లీక్‌.. ప్రభాస్‌ లుక్ చూస్తే!

టాప్ అధికారులు, ఇద్దరు అణుశాస్త్రవేత్తలు..

ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఇరాన్ పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్ ఛీఫ్ సహా పలువురు కీలక వ్యక్తు మరణించినట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ మృతి చెందారని చెబుతున్నారు. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని సెక్రటరీ జనరల్ అలీ అక్బర్ అహ్మదియన్, క్వాడ్స్ ఫోర్స్ హెడ్ ఎస్మాయిల్ కానీ, ఇరాన్ డిప్యూటీ ఛీప్ ఘోలమ్ అలీ రషీద్ ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. 

Also Read :  కాలిబూడిదైన విమానం.. చెక్కు చెదరని భగవద్గీత (వీడియో)

Also Read :  త్వరలోనే ఇండియా నుంచి చైనాకు విమాన ప్రయాణాలు.!

officers | scientists | today-latest-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు