Iran: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. భారతీయులకు కీలక ఆదేశాలు

ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ భయాందోళనకు గురికావొద్దని టెహ్రాన్‌లోని దేశ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది.

New Update
Indians in Iran asked to exercise caution, maintain contact with embassy

Indians in Iran asked to exercise caution, maintain contact with embassy

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ భయాందోళనకు గురికావొద్దని.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. అలాగే టెహ్రాన్‌లోని దేశ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచనలు చేసింది. 

Also Read: ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్‌కు వేలాడదీసిన భర్త

'' ప్రస్తుతం ఇరాన్‌లో ఉంటున్న భారతీయులు, భారత సంతతి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ప్రయాణాలు మానుకోండి. రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి. స్థానిక అధికారులు సూచించే భద్రతా నిబంధనలు పాటించాలని'' టెహ్రాన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పేర్కొంది. ఓ గూగుల్‌ ఫాంను పోస్ట్ చేసి భారత పౌరులు తమ వివరాలు పొందుపర్చారని సూచనలు చేసింది. అలాగే హెల్ప్‌లైన్ నెంబర్లను కూడా పోస్ట్ చేసింది. 

Also Read: ఇరాన్ ఆయిల్ గోడౌన్స్ నుంచి గ్యాస్, అణు కర్మాగారం వరకు.. దేన్నీ వదలని ఇజ్రాయెల్.. వీడియోలు వైరల్!

ఇదిలాఉండగా ఇరాన్‌లోని అణు, ఆయుధ, సైనిక స్థావరాలే లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయెల్‌ భీకర దాడులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్‌ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్ అణు కార్యక్రమాలను, క్షిపణి వ్యవస్థలను నిర్మూలించడమే తమ లక్ష్యమని ఇప్పటికే నెతన్యాహు క్లారిటీ ఇచ్చేశారు. అలాగే ఇది తమ ఆరంభం మాత్రమేనని తెలిపారు. ఇరాన్‌పై మరిన్ని వైమానిక, క్షిపణి దాడులు చేపడతామన్నారు. ఇరాన్‌ పౌరులు తమ లక్ష్యం కాదని ఇప్పటికే IDF స్పష్టం చేసింది. ఇరాన్ ఆయుధ తయారీ కర్మగారం సమీపంలో ఉండేవారు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలని ఆదేశించింది. 

Also Read: మనాలి జిప్ లైన్ అడ్వెంచర్ లో విషాదం.. 30 అడుగుల లోయలో పడ్డ బాలిక...ఆ తర్వాత.

Also Read:  స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 లో పెద్ద లోపం...గుర్తించిన ఇస్రో

Advertisment
Advertisment
తాజా కథనాలు