/rtv/media/media_files/2025/06/15/8tTwL2Anw31dsLAlBkSm.jpg)
Space x rocket Falcon-9
భారత్ కు చెందిన శుభాన్షు శుక్లాతో పాటూ నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్ళే స్పేస్ ఎక్స్ రాకెట్ పేరే ఫాల్కన్ 9. దీని ప్రయాణం ఇప్పటికి ఐదుసార్లు వాయిదా పడింది. టెక్నికల్ ప్రాబ్లెమ్స్ వల్ల ప్రయాణాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు జూన్ 19న ఈ రాకెట్ ప్రయాణిస్తుందని నాసా ప్రకటించింది. అయితే ఇప్పుడు దీని గురించి కొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. మొదటి దశలో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైనప్పుడు మన ఇస్రో నే దానిని ఆపింది అని చెబుతున్నారు. ఛైర్మన్ వి. నారాయణన్ పట్టు పట్టడం వల్లనే ఫాల్కన్ 9 ప్రయాణాన్ని ఆపారని తెలుస్తోంది.
ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ పట్టు..
ఫాల్కన్-9 రాకెట్ నలుగురు వ్యోమగాములను - ఆక్సియం 4 మిషన్లో భాగంగా - అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళుతుంది. అక్కడ వారు 14 రోజుల పాటూ గడిపి అనేక ప్రయోగాలు చేసి వస్తారు. అయితే ఈ రాకెట్ ను పంపే ముందు ఇస్రో, ఆక్సియం స్పేస్ మధ్య చాలా రోజుల పాటూ చర్చ జరిగిందని తెలుస్తోంది. జూన్ 10న లిఫ్ట్ ఆఫ్ కు ఒక రోజు ముందు రాకెట్ లో పగుళ్లు ఉన్నాయని, ప్రొపెల్లంట్ లీక్ అయిందని గుర్తించారు. మన ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఈ లోపాన్ని గుర్తించారు. ఈ విషయంపై అందరూ కలిసి చర్చించుకున్నారు. కానీ అదేమీ పెద్ద విషయం కాదంటూ స్పేస్ ఎక్స్ దానిని ప్రయోగించడానికి సిద్ధమైంది. అయితే ఇస్రో ఛైర్మన్ నారాయణన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ప్రాబ్లెమ్ ను క్లియర్ చేస్తే కానీ రాకెట్ ను లాంచ్ చేయడానికి వీలు లేదని చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర చర్చలు నడిచాయి. చివరకు మిషన్ ను వాయిదా వేశారు. జూన్ 11న వెళ్ళాల్సిన ఫాల్కన్ 9 ప్రయోగం రద్దయింది.
దీని తరువాత స్పేస్ ఎక్స్ బృందాలు లాంచ్ ప్యాడ్ కు వెళ్ళి తనిఖీలు నిర్వహించారు. ఇందలో చాలా పెద్ద లోపం బయటపడింది. వెల్డ్ క్రాక్..అంటే ద్రవ ఆక్సిజన్ లైన్లలో ఒక దానిలో పెద్ద లోపం కనిపించింది. మొదటి దశలో దీనిని రీసైకిల్ చేశారు. కానీ ఎవరూ ఈ పగులును గుర్తించలేదు. ఇస్రో ఛైర్మన్ నారాయణ్ మాత్రం దీన్ని పసిగట్టగలిగారు. ఇదే కనుక పట్టించుకోకపోయి ఉంటే ఆక్సిజన్ లీక్ అయి రాకెట్ పేలిపోయి ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా ఆక్సియమ్ స్పేస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీ కామ్ గఫారియన్ అంగీకరించారు.
Also Read: Nigeria: నైజీరియాలో దారుణం.. 100 మందిని బంధించి సజీవ దహనం!