భారత్-పాక్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశం నేపాల్ తన విధేయతను వెల్లడించింది. భారత్పై దాడి చేయడానికి తమ భూమిని ముట్టుకోవద్దని నేపాల్ పాక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్కు సపోర్ట్గా ఉంటామని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ దాడిలో నేపాలీ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నేపాల్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్కు సపోర్ట్గా నిలుస్తుంది. ఉగ్రదాడులతో ఆందోళన చెందుతున్న ఈ ప్రాంతం త్వరలోనే శాంతిగా మారుతుందని తెలిపారు.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
Ministry of Foreign Affairs, Government of Nepal: Nepal stands together with all in the fight against terrorism. In line with its principled position, Nepal shall not allow any inimical forces to use its soil against its neighbouring countries pic.twitter.com/dQMjoCpIWx
— All India Radio News (@airnewsalerts) May 8, 2025
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
సరిహద్దు జిల్లాల్లో..
ఇదిలా ఉండగా గురువారం జమ్మూ ఎయిర్పోర్ట్పై పాకిస్థాన్ మిసైల్స్, డ్రోన్ల దాడులకు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ వాటిని నేలకూల్చింది. దీంతో జమ్మూ నగరమంతా అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని భారత సైన్యం హెచ్చరించింది. పాక్ సరిహద్దుగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారత్పై దాడికి పాల్పడిన పాక్ ఫ్లైట్ జెట్లను ఇండియన్ సైన్యం తిప్పికొట్టింది.
ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్లోకి తరలింపు
BIG BREAKING 🚨
— Hinduism_and_Science (@Hinduism_sci) May 8, 2025
Nepal stands with India. Stronger together! 🇮🇳🇳🇵 💪#OperationSindoor2 pic.twitter.com/sPCDNqYSXd
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్