/rtv/media/media_files/2025/05/15/lG8aEWTVMTmmSy41NH9r.jpg)
medak crime Photograph: (medak crime)
TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. ప్రియుడికోసం భర్తను దారుణంగా హతమార్చింది ఓ భార్య. మద్యం తాగించి ప్రియుడు, మరో స్నేహితులతో కలిసి అత్యంత కృరంగా బీరు సీసాలతో కొట్టి చంపించింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు మిస్సింగ్ కేసు పెట్టింది. కానీ పోలీసుల విచారణలో అసలు నిజం భయటపడగా మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read : ఇట్స్ అఫీషియల్.. హైదరాబాద్ మెట్రో ఛార్జిలు పెంపు.. కొత్త ఛార్జీల లిస్ట్ ఇదే
పంచాయితీ పెట్టిన మారని బుద్ది..
హవేలీ ఘనపూర్ మండలం షమ్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీను, లత దంపతులు కొంతకాలం బాగానే ఉన్నారు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తితో లత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గుర్తించిన శ్రీను.. చాలా సార్లు హెచ్చరించాడు. అయినా ఆమె మారకపోవడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించగా నచ్చజెప్పారు. అయినా పద్ధతి మార్చుకోని లత..ప్రియుడితో కలిసి తన భర్త అడ్డును తొలిగించాలని భావించింది.
Also Read: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్నాథ్ సింగ్
ఈ క్రమంలోనే భర్తను హతమార్చేందుకు అదే గ్రామానికి చెందిన మలిశెట్టి మోహన్ అనే వ్యక్తికి రూ.50 వేలు ఇచ్చింది. మే 16న మద్యం సేవించేందుకు శ్రీనుని అనంతసాగర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లిన మోహన్.. మత్తులో ఉండగానే బీరు సీసాతో తలపై కొట్టి హతమార్చాడు. మే 28న భర్త కనిపించడం లేదంటూ లత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేస్తుండగా అనుమానంతో లతను గట్టిగా నిలదీశారు. దీంతో తామే హత్య చేశామని లత, ఆమె ప్రియుడు రమేష్ అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: అబ్బాయిలంటే అలెర్జీ.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వైరల్ వీడియో!
Also Read : 'ప్యారడైస్' రికార్డ్స్ హంట్ షురూ.. భారీ ధరకు అమ్ముడైన ఆడియో రైట్స్!
today telugu news | telugu-news | husband | killed | wife