Pakistan: పాకిస్థాన్‌కు షాక్.. 22 మంది సైనికులు హతం

బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌పై మరోసారి దాడులకు పాల్పడింది. తాజాగా తుర్బత్, దుక్కిలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసింది. అయితే దాడుల్లో 22 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు.

New Update
balochistan Liberation Army

balochistan Liberation Army

పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ దేశంలోని రెబల్ గ్రూప్ అయిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్థాన్‌పై మరోసారి దాడులకు పాల్పడింది. తాజాగా తుర్బత్, దుక్కిలో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేసింది. అయితే దాడుల్లో 22 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. చాలామందికి గాయాపడ్డారు. అలాగే ఆరుగులు బలుచిస్థాన్ ఫైటర్స్‌ కూడా మృతి చెందారు. మరో ప్రాంతంలో పాక్ ఆర్మీ, BLA మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. కొన్ని పట్టణాలపై BLA పట్టు సాధించినట్లు తెలుస్తోంది.  

Also Read: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. ప్రజల దృష్టి మార్చేందుకే ఉగ్రదాడికి దిగిందా ?

Also Read :  పాక్‌ మహిళతో CRPF జవాన్ పెళ్లి.. చివరికి ఊహించని షాక్

Balochistan Liberation Army Attack On Pakistan Army

దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారనేదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే తాజాగా ఓ కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు శ్రీలంక రాజధాని కోలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.  ఇక వివరాల్లోకి వెళ్తే.. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భారత్‌ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహించారు. అయితే శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్‌ 122 విమానంలో చేపట్టిన తనిఖీల్లో ఆరుగురు అనుమానితులు పట్టుబడ్డారు. వాళ్లని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పహల్గాం దాడికి వాళ్లతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

Also Read: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. దిగుమతులపై భారత్ నిషేధం.. ఇందులో ఏమున్నాయంటే!

మరోవైపు పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా 2023లో రాజౌరిలో ఉగ్రదాడి కేసులో అరెస్టయిన ఇద్దరు ఖైదీలను విచారణ చేసింది. ప్రస్తుతం జమ్మూలోని కోట్‌ భల్వాల్‌  జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌ నిస్సార్‌ అహ్మద్‌, అలాగే ముస్తాక్‌ హుస్సేన్‌ను ప్రశ్నించింది. పహల్గాం ఉగ్రదాడికి వీళ్లకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అనే అనుమానంతో విచారణ చేసినట్లు తెలుస్తోంది. 

Also Read :  భక్తులకు అలర్ట్‌... ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు మూసివేత

       

balochistan liberation army | balochistan attack | rtv-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు