USA: అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ట్రంప్ కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ప్రసంగించారు. అమెరికా ఇంక తగ్గేదే లే అని చెప్పారు. అంతకు ముందు నాలుగేళ్ళల్లో చేయలేని పనిని ఈ 43 రోజుల్లోనే చేశానని చెప్పారు. 

New Update
Trump First congress speech

Trump First congress speech

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) పదవీ బాధ్యతలు చేపట్టి ఇప్పటికి రెండున్నర నెలలు కావొస్తోంది. ఈ సమయంలోనే ఆయన దాదాపు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టడమే కాకుండా... వాటిని అమల్లోకి కూడా తీసుకువచ్చారు. దీనిపై ఈరోజు ఆయన యూఎస్ కాంగ్రెస్ లో మాట్లాడారు. నవంబర్ లో ఎన్నికల్లో గెలిచాక, పదవిలోకి వచ్చాక కాంగ్రెస్ లో ట్రంప్ మాట్లాడ్డం ఇదే మొదటిసారి . ఆరు వారాల్లో తాను చేసిన పనులు, సాధించిన విజయాల గురించి ట్రంప్ చెప్పుకున్నారు. నాలుగేళ్లు, ఎనిమిదేళ్లలో సాధించిన దానికంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్లు తెలిపారు. ఇది మొదలు మాత్రమేనని..ఇక మీదట అమెరికా ఎక్కడా తగ్గేదేలే అని చెప్పారు ట్రంప్. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగొచ్చిందని...తన దేశాన్ని మళ్ళి తిరిగి అగ్రరాజ్యంగా నిలబెట్టడమే తన ధ్యేయమని చెప్పారు. 

Also Read :  రాబోయే 25 ఏళ్లలో అతిపెద్ద ముస్లిం దేశంగా భారత్!

అగ్రరాజ్యాన్ని నిలబెట్టడమే తక్షణ కర్తవ్యం...

తాను రాక ముందు అమెరికా అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కుందని ట్రంప్ అన్నారు. 48 ఏళ్ళల్లో ఇదే బిగ్ లాస్ అని చెప్పారు. ప్రస్తుతం దాన్ని సరిదిద్ది, ఆర్ధిక వ్యవస్థను కాపాడటమే తన ప్రాధాన్యతని చెప్పుకొచ్చారు. అమెరికా మునుపటి స్థితికి తిరిగి వచ్చిందని చెప్పారు. అమెరికన్ల కలను నెరవేర్చే పనిలో ఉన్నానని అన్నారు.  అలాగే ఉక్రెయిన్ (Ukraine) యుద్ధాన్ని ముగించడానికి తాను చాలా కృషి చేస్తున్నానని చెప్పారు ట్రంప్. దాంతో పాటూ తాను పదవిలోకి వచ్చాక ఏఏ పనులు చేశారో వాటన్నింటినీ వివరించారు. అమెరికాలో అక్రమల వలసలను అరికట్టడానికి ప్రభుత్వం ఎలా పని చేస్తుందో చెప్పారు. మరోవైపు తనకు అన్ని విధాలా చేయూతనిస్తూ...ప్రభుత్వ సమర్ధ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఎలాన్ మస్క్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. అతను చాలా కష్టపడి పని చేస్తున్నాడని మెచ్చుకున్నారు. 

Also Read :  గంజి నీళ్లతో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు చెక్‌

ఇక సుంకాలు గురించి మాట్లాడుతూ... ఇతర దేశాల మీద కూడా సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు ట్రంప్. ఇతర దేశాలు దశాబ్దాలుగా మనపై సుంకాలను ఎక్కువగా విధిస్తున్నారు. అమెరికా వసూలు చేసే దానికన్నా ఇతర దేశాలు ఎక్కువ సుంకాలను విధిస్తున్నాయని ఆయన అన్నారు. భారతదేశం మన నుండి 100 శాతం కంటే ఎక్కువ ఆటో సుంకాలను వసూలు చేస్తోంది. ఇది అమెరికాకు ఎంత మాత్రం న్యాయం కాదని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఇతర దేశాలు ఎంత విధిస్తే తాము కూడా అంతే సుంకం వసూలు చేస్తామని స్పష్టం చేశారు ట్రంప్. 

Also Read: AP: ఏపీలో మహిళా రైడర్లు..ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Also Read :  తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు