/rtv/media/media_files/2025/03/05/fmHD8ZqaG0CsfE2PpnPL.jpg)
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపేస్తామని కూడా బెదిరించారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు.. కొన్ని క్షణాలపాటు దాన్ని స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు.
Also read : దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..!
పోలీసులకు వేముల ఫిర్యాదు
అయితే అందుకు ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలకు పంపారు. దీంతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read : హైదరాబాద్లో విషాదం.. కాబోయే భార్యను ఆటపట్టించబోయి మృతి.. అసలేమైందంటే..!
పోలీసుల సూచనతో ఆ నంబర్ను ఎమ్మెల్యే వేముల బ్లాక్ చేశారు. మధ్యప్రదేశ్ నుంచి ఈ వీడియో కాల్ వచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. సైబర్ ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వేముల సూచించారు. ఇలాంటి ఘటనలు మీ దృష్టికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్ రింగ్ టోన్ ను పెట్టారని తెలిపారు.
న్యూడ్ కాల్ ఉచ్చులో ఇరుక్కున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2025
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు
క్షణాలపాటు దాన్ని స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేసిన సైబర్ నేరాగాళ్లు
ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలకు పంపారు… pic.twitter.com/oZFJ4tr2hK
Also read : రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్!
Also read : 13ఏళ్ల బాలుడు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్.. ట్రంప్ నిర్ణయానికి ఇదే కారణం!