suicide drones: పాకిస్తాన్ పై తాలిబాన్ సూసైడ్ డ్రోన్లు...ఎప్పుడైనా అటాక్..

పాకిస్తాన్ శత్రువులు తాలిబన్లు వారిపై అటాక్ చేయనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. పాక్ గగనతలంపై తాలిబన్ ఆత్మాహుతి డ్రోన్లు తిరుగుతున్నాయని సమాచారం. ఇవి ఎప్పుడైనా అటాక్ చేయవచ్చునని అంటున్నారు. 

New Update
afghanistan

afghanistan attack on pakistan

 పాకిస్తాన్ కు భారత్ తో పాటూ తాలిబన్లు కూడా శత్రువులు. పాకిస్తాన్ ఆఫ్ఘన్లను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తోంది. కానీ వాళ్ళు మాత్రం ఆ దేశం మీద దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. పహల్గాం దాడి తర్వాత తాలిబన్ ప్రభుత్వం డైరెక్ట్ గానే పాక్ ను విమర్శించింది, భారత్ తో చేతులు కలిపింది కూడా. ఇప్పుడు ఆ దేశంపై ఆత్మాహుతి డ్రోన్లతో దాడులు చేయడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. తాలిబన్లు ఒక కామికేజ్ డ్రోన్ ఎయిర్ ఫోర్స్ తయారు చేసిందని...వీటిల్లో కొన్ని హెలికాఫ్టర్లను కూడా చేర్చారని చెబుతున్నారు. ఇవి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఏ క్షణంలో అయినా ఈ డ్రోన్ సైన్యం కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ ల మీద అటాక్ చేయవచ్చునని అంటున్నారు.

Also Read: Thammudu Trailer: అక్క, తమ్ముడు ఎమోషన్ తో 'తమ్ముడు' ట్రైలర్ అదిరింది! ఇక్కడ చూడండి

Also Read: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. వెయిటింగ్ లిస్ట్‌పై కీలక నిర్ణయం!

డ్రోన్లను తయారు చేసిన పాకిస్తాన్ ఇంజనీర్..

ఈ మొత్తం విషయాన్ని డైలీ మెయిల్ నివేదించింది.  తాలిబన్ డ్రోన్ల తయారీ అయిపోయింది. అవి ప్రస్తుతం పరీక్షలను ఎదుర్కొంటున్నాయి. దానికోసం మాజీ బ్రిటిష్ SAS స్థావరాన్ని ఉపయోగిస్తోంది ఆఫ్ఘనిస్తాన్. ఇవి చాలా ప్రాణాంతకమైన డ్రోన్లని..ఏ దేశాన్ని అయినా క్షణంలో నాశనం చేయగలవని చెబుతున్నారు.  అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇంజనీరే వీటిని తయారు చేశారని తెలుస్తోంది. ఇవి చాలా ెద్ద ఎత్తున తయారు చేశారని...పాకిస్తాన్ తో పాటూ తాలిబన్లతో శత్రుత్వం ఉన్న ఏ దేశాలకైనా ప్రమాదకరమేనని అంటున్నారు. 

Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం

Also Read: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. !

 

today-latest-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు