Nicolas Aujula: 2025 అంతా వినాశనమే... నికోలస్‌ ఔజులా సంచలన జ్యోతిష్యం

లండన్‌కు చెందిన ప్రముఖ హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా, 2025లో జరగబోయే సంచలన విషయాలు వెల్లడించారు. 2025లో మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ప్రిడిక్షన్స్ చెప్పి అందరికీ షాక్ ఇస్తున్నారు. ఆధునిక ప్రవక్తగా పిలవబడుతున్ననికోలస్ 2025 గురించి ముందుగానే అంచనా వేశాడు.

New Update
Nicolas Aujula

Nicolas Aujula

Nicolas Aujula: లండన్‌కు చెందిన ప్రముఖ హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా (38), 2025లో జరగబోయే సంచలన విషయాలు వెల్లడించారు. కరోనా మహమ్మారి గురించి ముందే 2018లోనే చెప్పిన నికోలస్, 2025లో మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ప్రిడిక్షన్స్(prediction) చెప్పి అందరికీ షాక్ ఇస్తున్నారు.ఆధునిక ప్రవక్తగా పిలవబడుతున్న  నికోలస్ ఆజులా 2025 గురించి ముందుగానే అంచనా వేశాడు. పలు దిగ్భ్రాంతికరమైన అంశాలను వెల్లడించాడు.  ఈ ఏడాది మూడవ ప్రపంచ యుద్ధంతో పాటు, కొత్త మహమ్మారులు,  ప్రపంచ కరుణ లేకపోవడం వంటి సమస్యల గురించి హెచ్చరించాడు.

Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

అయితే 2025లో పెను విపత్తు పొంచి ఉందంటూ కాలజ్ఞాని బాబా వంగా చేసిన భవిష్యవాణి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆ జోస్యాలు నిజమవుతాయేమోనని జనం భయపడుతున్నారు. ఇదే సమయంలో, లండన్‌కు చెందిన ప్రముఖ హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా (38) కూడా 2025లో జరగబోయే సంచలన విషయాలు వెల్లడించారు. 2018లోనే కరోనా మహమ్మారి గురించి ముందే చెప్పిన నికోలస్, 2025లో మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ప్రిడిక్షన్స్ చెప్పి అందరికీ షాక్ ఇస్తున్నారు.

2025లో మూడో ప్రపంచ యుద్ధం(3rd-world-war) రావడం ఖాయమని తేల్చి చెప్పారు. మతం, దేశం పేరుతో ప్రజలు ఒకరినొకరు చంపుకునే దారుణమైన పరిస్థితులు వస్తాయని, హింస విపరీతంగా పెరిగిపోతుందన్నారు. అంతేకాదు, రాజకీయ నాయకుల హత్యలు, విపరీతమైన క్రూరత్వం కూడా చోటు చేసుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. దుష్ట శక్తులు ప్రపంచాన్ని శాసిస్తాయని, హింస, విధ్వంసంతో అంతా అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరించారు.

నికోలస్ అజులా యొక్క అత్యంత దిగ్భ్రాంతికరమైన అంచనా ప్రకారం 2025 మధ్య నాటికి మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అతని ప్రకారం, ఈ యుద్ధం ఏ రాజకీయ కారణం లేదా సరిహద్దు వివాదం వల్ల తలెత్తదు, కానీ ప్రపంచంలో కరుణ లేకపోవడం వల్ల తలెత్తుతుంది. ఈ యుద్ధం మతపరమైన, జాతీయవాద భావాల నుండి ప్రేరణ పొందుతుందని, బ్రిటన్ కూడా దాని నుండి దూరంగా ఉండదని అతను చెప్పాడు. ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ వివాదం, పాశ్చాత్య వర్గవాదం, మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు అతని హెచ్చరికలకు అనుగుణంగా పెరుగుతున్నాయి.

Also Read: చిన్న దేశమైనా రష్యాని చిత్తు చేస్తున్న ఉక్రెయిన్.. వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్..!

యుద్ధం గురించిన భయానక జోస్యాలు చెప్పడంతో పాటు సైన్స్, పర్యావరణంలోనూ సంచలనాలు తప్పవని నికోలస్ బాంబ్ పేల్చారు. 2025లో ల్యాబ్స్‌లో అవయవాలు సృష్టించడం జరుగుతుందని అంచనా వేశారు. కానీ, ఈ మెడికల్ మిరాకిల్ భారీ వర్షాల బీభత్సం ముందు వెలవెలబోతుందట. వరదల దెబ్బకు లక్షల ఇళ్లు నేలమట్టం కావడం ఖాయమని, జనం నిరాశ్రయులవుతారని నికోలస్ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, సముద్ర మట్టాలు పెరిగిపోవడంతో సిటీలు సైతం నీట మునుగుతాయని వివరించారు.

ఆజులా గతంలో చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి. దీంతో ఆయన చెప్పే విషయాలపట్ల ప్రజలు విశ్వాసాన్ని చూపుతున్నారు. అతను గతంలో చాలా అంచనాలు వేశాడు, అవి నిజమయ్యాయి. దీనిలో, అతను 2019లో COVID-19 మహమ్మారిని(Covid 19 Case) అంచనా వేశాడు. నోట్రే-డామ్ కేథడ్రల్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని అతను ఊహించాడు, అది నిజమైంది. 2020కి ముందు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం గురించి కూడా అతను సూచించాడు. 2024లో డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తిరిగి అధికారంలోకి వస్తారని కూడా అతను అంచనా వేశాడు, అది నిజమైంది. అతను AI (కృత్రిమ మేధస్సు) యొక్క వేగవంతమైన పురోగతిని ప్రస్తావించాడు. అతను చాలా సంవత్సరాల క్రితం AI (కృత్రిమ మేధస్సు) యొక్క వేగవంతమైన పురోగతిని ప్రస్తావించాడు. ఈ ఉదాహరణలు ఆజులాను జ్యోతిష్కుడిగా మాత్రమే కాకుండా, ఆధునిక కాలపు ప్రవక్తగా గుర్తింపును తీసుకువచ్చాయి.

Also Read: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?

2025 లో అంచన వేసిన సంచలనాలు

అజులా 2025 ను యుద్ధం మాత్రమే కాకుండా సహజ, రాజకీయ, సామాజిక తిరుగుబాట్లతో  కూడిన సంవత్సరంగా చూస్తున్నారు. ఆయన వేసిన అంచనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1.ప్రకృతి వైపరీత్యాలు - ప్రధాన భూకంపాలు, సునామీలు, వాతావరణ వైపరీత్యాలు.
2. మహమ్మారి - ఒక కొత్త అంటువ్యాధి ప్రబలుతుంది.  ముఖ్యంగా COVID  లక్షణాలను కలిగి ఉంటుంది
3. ఆర్థిక సంక్షోభం, - ప్రపంచ ద్రవ్యోల్బణం పెరుగుదల.
4. బ్రిటన్- కీర్ స్టార్మర్ ప్రభుత్వం పతనం.
5. అమెరికా అధ్యక్షుడిగా - డోనాల్డ్ ట్రంప్ పునరాగమనం, సాంప్రదాయ విలువల పెరుగుదల.
6. వైద్య రంగం- ప్రయోగశాలలో పెరిగిన మానవ అవయవాల విజయం.
7. రాచరికం విషయంలో - ప్రిన్స్ విలియం,  ప్రిన్స్ హ్యారీ రాజీపడుతారని తెలిపారు.

Also Read: ట్రంప్ సంచలన నిర్ణయం.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు