BIG BREAKING: ఇండియాకు చైనా వార్నింగ్.. ‘పాక్ లాగే మీకూ నీళ్లు ఉండవు’

సెంటర్‌ ఫర్‌ చైనా అండ్‌ గ్లోలైజేషన్‌ ఉపాధ్యక్షుడు విక్టర్‌ జికాయ్‌ గవో ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్థాన్‌కు సిందూ నదీ జలాలు ఇవ్వకుంటే.. చైనా కూడా భారత్‌‌కు బ్రహ్మపుత్ర నీళ్లను రాకుండా అడ్డుకోగలదని విక్టర్‌ జికాయ్‌ గవో అన్నాడు.

New Update

నీటి పంపకాలపై భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్‌కు నీళ్లు వదలకుండా సిందూ నదీ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై చైనా ఇండియాని హెచ్చరించింది. బ్రహ్మపుత్ర నదీ జలాలు భారత్‌లోకి రాకుండా అడ్డుకుంటామని చైనా బెదిరిస్తుంది. పాకిస్థాన్‌కు మద్దతుగా చైనా రంగంలోకి దిగింది.

సెంటర్‌ ఫర్‌ చైనా అండ్‌ గ్లోలైజేషన్‌ ఉపాధ్యక్షుడు విక్టర్‌ జికాయ్‌ గవో పాక్‌కు సింధూ జలాల నిలిపివేత పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు నీరు ఇవ్వకుండా భారత్‌ అడ్డుకుంటే.. చైనా కూడా భారత్‌‌కు నీళ్ల రాకుండా అడ్డుకోగలదని విక్టర్‌ జికాయ్‌ గవో అన్నాడు. సిందూ నదీ జలాల ఒప్పందాన్ని మళ్లీ ప్రారంభించి పాకిస్తాన్‌కు నీళ్లు ఇప్పించాలని చైనా ప్రయత్నిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా, పాక్ మధ్య యుద్ధం నెలకొంది. ఈక్రమంలో చైనా పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా నిలుస్తోంది. ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసింది. దీంతో చైనా కూడా భారత్‌కు బ్రహ్మపుత్ర నీళ్లు రాకుండా ఆపతామని బెదిరిస్తోంది.

china | Brahmaputra water | river | india | indo pak war | what will happen if sindhu river stops | pakistan | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు