Road Accident: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్‌లో పదిమంది!

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్ మండలం కొత్తపహాడ్ దగ్గర కుక్కను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Accident

Accident

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మిరప కూలీలు వెళ్తున్న ఆటో ఆత్మకూర్ మండలం కొత్తపహాడ్ దగ్గర కుక్కను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

రంగారెడ్డి జిల్లాలో కూడా..

ఇదిలా ఉండగా ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బంధువుల వివాహానికి వచ్చి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4) అనే అక్కచెల్లెళ్ల పిల్లలు బంధువుల నివాసంలో వివాహ వేడుకకు వచ్చారు. ఈ క్రమంలో వారు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారు దగ్గర ఆడుకున్నారు. ఆ సమయంలో వారు ఆటల్లో భాగంగా కారులోకి వెళ్లారు. ఆ సమయంలో కార్ డోర్లు లాక్ అయ్యాయి. దీంతో వారు బయటకు రాలేకపోయాయి.  

దీంతో ఊపిరి ఆడక ఆ ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే.. చిన్నారులు ఎంత సేపటికీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు చిన్నారులు కారులో అపస్మారకంగా కనిపించారు. దీంతో వెంటనే వారిని బయటకు తీసి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు అప్పటికే వారు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. 

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

 

nalgonda | road-accident | telangana crime incident | telangana crime news | telangana-crime-updates | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు