/rtv/media/media_files/2025/06/10/GDaFlmzcBnnFrOX01enh.jpg)
రాజేంద్రనగర్ లో జూన్ 05వ తేదీన జరిగిన జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షేక్ అబుల్లా, రిజ్వానా అనే వృద్ధ దంపతులు రాజేంద్రనగర్ సర్కిల్ జనచైతన్య వెంచర్ పేస్-2లో అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ నెల 05వ తేదీన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బురఖావేసుకుని వచ్చి మరీ హత్యకు పాల్పడ్డారు. గతంలో ఈ వృద్ధ దంపతుల వద్ద పనిచేసిన పాత డ్రైవర్ అతని స్నేహితుడే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. నిందితుడిని మెదక్ లో అరెస్ట్ చేశారు.
Also Read : గ్రెటా థన్బర్గ్కు షాక్.. వెనక్కి పంపిన ఇజ్రాయెల్
Also Read : శివశివా.. కాశీలో 21 మంది నకిలీ పూజారుల అరెస్టు
డ్రైవర్గా రెండున్నరేళ్లు పనిచేసి
షేక్ అబుల్లా ఇంట్లో డ్రైవర్గా రెండున్నరేళ్లు పనిచేసిన సల్మాన్ను వారు చీటికిమాటికి తిడుతుండేవారు. 10 నెలల క్రితం అతన్ని పనినుంచి తొలగించారు. అవమానించారని ఆగ్రహం పెంచుకున్న సల్మాన్ వారిని ఎలాగైనా హత్య చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే తన స్నేహితుడితో కలిసి వారిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. జూన్ 05వ తేదీన ఒకరు బురఖాతో మరోకరు మాస్కు, క్యాపు పెట్టుకుని వారి ఇంటికి వెళ్లారు. వృద్ధ దంపతులకు సన్నిహితులమని వాచ్మెన్కు చెప్పడంతో వారిని లోపలికి అనుమతించాడు. దీంతో వారు లోపలికి వెళ్లి వారిని హత్య చేశారు. హత్య చేసిన తరువాత సహాయకుడిగా వచ్చిన వ్యక్తి వెంటనే వెళ్లిపోగగా సల్మాన్ మాత్రం అక్కడే కాసేపు ఉన్నాడు. అనంతరం ఇద్దరు వేర్వేరుగా అక్కడినుంచి పరారయ్యారు. ప్రస్తుతం సల్మాన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడికి సహకరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
Also Read : ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ డేట్ ఫిక్స్..
Also Read : 16 రోజులు, 120 మంది పోలీసులు, 3 రాష్ట్రాలు.. ఆపరేషన్ హనీమూన్ మిస్టరీ ఇదే!
hyderabad | double-murder | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu crime news