/rtv/media/media_files/2025/06/10/UDsHX3MQ7oUbwUralpl3.jpg)
మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయంలో పూజారులుగా నటిస్తూ భక్తులును మోసం చేస్తున్న 21 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆలయంలో దర్శనం, పూజల ఏర్పాటు పేరుతో అనధికార వ్యక్తులు డబ్బు తీసుకుంటూ సందర్శకులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గత కొన్ని రోజులుగా అనేక ఫిర్యాదులు అందాయని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) దశాశ్వమేధ అతుల్ అంజన్ త్రిపాఠి తెలిపారు.
➡️ वाराणसी: श्रद्धालुओं से ठगी करने वाले फर्जी पंडा गिरफ्तार
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) June 10, 2025
➡️ काशी विश्वनाथ क्षेत्र से 21 फर्जी पंडा पकड़े गए
➡️ दर्शन करवाने के नाम पर श्रद्धालुओं से करते थे ठगी
➡️ पैसे लेकर करते थे गुमराह, दशाश्वमेध थाना क्षेत्र का मामला#Varanasi #FakePandaArrested #KashiVishwanath… pic.twitter.com/bnw99qfhvr
నిందితులపై చట్టపరమైన చర్యలు
ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. 21 మంది నకిలీ పూజారులను అరెస్టు చేశామన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ నకిలీ పూజారులు సులభంగా దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చి, ఒక్కొక్కరికి రూ.500 నుండి రూ.1000 వరకు వసూలు చేసేవారు. డబ్బు తీసుకున్న తర్వాత, భక్తులను ఆలయ ప్రాంగణం వైపు తీసుకెళ్లినట్లు నటించి, వారిని ఏదో ఒక వీధిలో వదిలిపెట్టి అదృశ్యమయ్యేవారు. భక్తులు ఎవరికీ పడితే వారికి డబ్బులు ఇచ్చి మోసం పోకూడదని జాగ్రత్తగా ఉండాలన్నారు.