/rtv/media/media_files/2025/06/10/by4Dzm0QvgodIHGwl7A1.jpg)
మధ్యప్రదేశ్కు చెందిన ఇండోర్ బిజినెస్ మెన్ రాజా రఘువంశీ హత్య కేసును మేఘాలయ పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి రాజా భార్య సోనమ్ రఘువంశీ అని పోలీసులు తేల్చారు. ఆమె తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్ల సహాయంతో ఈ కుట్రను అమలు చేసింది. పోలీసు బృందం నిందితులందరినీ ట్రాన్సిట్ రిమాండ్పై షిల్లాంగ్కు తీసుకెళ్తోంది. అక్కడ వారిని మరింత విచారించనున్నారు. మేఘాలయ పోలీసులు ఈ కేసుకు ఆపరేషన్ హనీమూన్ అని పేరు పెట్టారు.
Also Read : మాగంటి గోపీనాథ్ పై దాఖలైన పిటిషన్లు క్లోజ్
ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన సిట్లో 120 మంది పోలీసులు ఉన్నారు. వీరిలో ఎస్పీ, డీఎస్పీ ర్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. ఈ బృందాలకు తూర్పు ఖాసీ హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సియెమ్, ఎస్పీ (నగరం) హెర్బర్ట్ పినియాద్ ఖార్కోంగోర్ నాయకత్వం వహిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జయంతియా హిల్స్ మౌంటెనీరింగ్ క్లబ్, స్నిఫర్ డాగ్స్ బృందాలు కూడా ఈ దర్యాప్తులో పాల్గొన్నాయి.
Also Read : గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. దీని తర్వాత, సోనమ్ ప్లాన్ ప్రకారం రాజాను హనీమూన్ కోసమని మేఘాలయ తీసుకువెళ్లింది. మే 23న, వారిద్దరూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. జూన్ 2న, సోహ్రా (చిరాపుంజి)లోని విసావాడోంగ్ జలపాతం సమీపంలోని లోతైన లోయలో రాజా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకు సోనమ్ ప్లాన్ చేసి ఉంటుందని పోలీసులతో పాటుగా ఎవరూ ఊహించలేదు.
అయితే ఫోన్ లోని వివరాలు సేకరించిన తరువాత మొత్తం కథంతా బయటపడింది. వివాహం జరిగిన వెంటనే, సోనమ్ రాజాను అంతం చేయడానికి కుట్ర పన్నడం ప్రారంభించింది. మే 21న నిందితులందరూ గౌహతికి వచ్చారు. మే 23న రాజాను ప్లాన్ ప్రకారం హత్య చేశారు. దీని తర్వాత, సోనమ్ మే 23న గౌహతి నుండి రైలులో ఇండోర్కు బయలుదేరింది. ఆమె మే 25న ఇండోర్ చేరుకుని అక్కడ రాజ్ను కలిసింది.
Also Read : రేపు విచారణకు KCR.. BRS బిగ్ స్కెచ్ !
ఒకరితో ఒకరు టచ్ లోనే
హత్య తర్వాత, సోనమ్, రాజ్ ఒకరితో ఒకరు టచ్ లోనే ఉన్నారు. ఫోన్ లో వివరాల అధారంగా పోలీసులు కేసును ఛేదించారు. మేఘాలయ పోలీసులు సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహాను ఇండోర్ లో అరెస్టు చేశారు. హత్య కుట్రలో పాల్గొన్న విశాల్ అలియాస్ విక్కీ ఠాకూర్ను ఇండోర్ లో, ఆకాష్ రాజ్పుత్ను యూపీలోని లలిత్పూర్ లో అరెస్టు చేశారు, ఆనంద్ను మధ్యప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు.
Also Read : 7 గంటల పాటు నేను, రష్మిక డంప్ యార్డ్ లో.. హీరో ధనుష్ కామెంట్స్ వైరల్
telugu-news | Madhya Pradesh | crime | Sonam | Raja Raghuvanshi