/rtv/media/media_files/2025/06/10/n52v280QVQRt98iIbewX.jpg)
Meghalaya Honeymoon Murder Case
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ హత్య కేసులో రాజ్ సింగ్ కుష్వాహాతో సహా 5 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని విచారించగా.. రాజా హత్యకు గల పలు వివరాలను వారు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
రూ.20 లక్షలకు డీల్
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ‘‘సంఘటన జరిగిన రోజు మేము కొండ ఎక్కడం అలసిపోయాం. అందువల్ల రాజా రఘువంశీని చంపడానికి నిరాకరించాం. కానీ సోనమ్ దానికి ఒప్పుకోలేదు. ఆమె మాకు రూ.20 లక్షలు ఇస్తానని చెప్పింది. వెంటనే రాజాను చంపేయాలంది. ఆమె ప్రలోభం పెట్టిన తర్వాత సోనమ్ రాజాకు తెలియకుండా.. అతడి పర్సు నుండి 15,000 రూపాయల నగదు తీసి మాకు ఇచ్చింది. అది అడ్వాన్స్ అని చెప్పింది.’’ అని పోలీసుల విచారణలో నిందితులు తెలిపినట్లు సమాచారం.
Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్
మరోవైపు దర్యాప్తు సంస్థలకు అందిన చాట్ల ప్రకారం.. వివాహం జరిగిన మూడవ రోజున.. సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో తన భర్త రాజా రఘువంశీని చంపడం గురించి మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ చాట్లో భర్త రాజా తన దగ్గరికి రావడం తనకు ఇష్టం లేదని కూడా సోనమ్ వెల్లడించినట్లు సమాచారం. ఇప్పుడీ విషయాలు నెట్టింట వైరల్గా మారాయి.
Also Read: లాస్ఏంజెల్స్లో ఆందోళనలు.. రిపోర్టర్ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)
మూడు రోజుల రిమాండ్
హనీమూన్లో భర్త హత్య కేసులో సోనమ్కు కోర్టు రిమాండ్ విధించింది. సోనమ్కి ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చిన తర్వాత.. ఆమెను షిల్లాంగ్కు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె బీహార్లో ఉంది. ఇక్కడి నుండి ఆమె విమానంలో మరింత దూరం ప్రయాణిస్తుంది. షిల్లాంగ్లోని మేఘాలయ పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడి నుండి ఆమెను రిమాండ్కు తరలిస్తారు.
Also Read : మునగ నీటితో అద్భుత లాభాలు.. డయాబెటిక్ రోగులకు బెస్ట్ కషాయం..!!