Hyderabad: హైదరాబాద్ దుర్గం చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కాప్రాలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన దుర్గామాధవి ఈ దారుణానికి పాల్పడింది. భర్త ప్రభు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే గురువారం రోజే ఆమె సూసైడ్ చేసుకోబోతున్నట్లు తన ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయిందని, అచూకి తెలియట్లేదంటూ ప్రభు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దుర్గం చెరువులో మృతదేహాం.. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం దుర్గం చెరువులో లభించిన మృతదేహాన్ని పరిశీలించగా ఆమె దుర్గా అని గుర్తించారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. ఇక దుర్గ మరణానికి కారణమేమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: Girls Hostel: గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ ఇష్యూ.. వెలుగులోకి సంచలనాలు! నాకు లేడనే బెంగతో.. ఇదిలా ఉంటే.. హైదరాబాద్లోని సికింద్రాబాద్ లాలాపేటలో విషాదకర ఘటన జరిగింది. లక్ష్మీ, ఆమె కుమారుడు అభినవ్ గత ఎనిమిది ఏళ్లుగా సికింద్రాబాద్లోని లాలాపేటలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే తల్లి లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తన తల్లి మరణాన్ని తట్టుకోలేని కొడుకు అభినవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ గదిలో అయితే తన తల్లి చనిపోయిందో.. అదే గదిలో అభినవ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఇంట్లో ఇద్దరి మృతదేహాలు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు, స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఇది కూడా చదవండి: P Kishor: పాట్నాలో ప్రశాంత్ కిశోర్ నిరసన.. లగ్జరీ వ్యానుపై విమర్శలు! అనంతరం అభినవ్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. ఆ నోట్ ప్రకారం.. ""నాకు, అమ్మకు గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నాన్న కూడా లేరు. మా బంధువుల గురించి వెతకొద్దు. నన్ను క్షమించండి"" అంటూ ఆ నోట్లో రాసుంది. అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన లాలాగూడ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.