BREAKING: కూతురి రెండో పెళ్లికి అడ్డమని... అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసిన అమ్మమ్మ

ఏపీలో రెండో పెళ్లికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసిపాపను చంపేసిన దారుణ ఘటన జరిగింది. శైలజ అనే యువతి రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఇది నచ్చక తల్లి ఆమె మనస్సును మార్చి రెండో పెళ్లికి సిద్ధం చేసింది. ఈ పసి పాప అడ్డుగా ఉందని గొంతు నులిమి చంపేశారు.

New Update
Baby

Baby murder

టెక్నాలజీ మారిపోయిన తర్వాత సమాజం ఎటు వెళ్తుందో తెలియడం లేదు. సొంత తల్లిదండ్రులు, సోదరులు, కన్న బిడ్డలను వాళ్ల సుఖాల కోసం చంపేస్తున్నారు. దేశంలో రోజురోజుకు క్రైమ్ పెరిగిపోతుంది. పసి పిల్లలను కూడా చంపేస్తున్నారు. రెండో పెళ్లికి 5 నెలల పసికందు అడ్డంగా ఉందని ఇటీవల చింపేసిన దారుణ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

కులాంతర వివాహం చేసుకుందని..

వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో పసుపులేటి అన్నవరం కుటుంబంతో ఉంటుంది. గ్రామంలో ఈమె కులపెద్దగా వ్యవహరిస్తుంటుంది. అయితే ఈమె కుమార్తె శైలజ వేరే కులం అబ్బాయిని ప్రేమించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు ఒప్పుకోరని ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే గర్భవతి కావడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. 5 నెలల కింద యశ్విత అనే పాప కూడా పుట్టింది. అయితే కులాంతర వివాహం అని తల్లి కూతురు మనస్సును మార్చేసింది.

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

తమ కులానికి చెందిన వ్యక్తితో రెండో పెళ్లి చేస్తానని చెప్పింది. దీంతో మనస్సు శైలజ కూడా మనస్సు మార్చుకుంది. రెండో పెళ్లికి పసిపాప అడ్డుగా ఉందని తల్లి అన్నవరం, కూతురు శైలజ కలిసి గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత పక్కింటిలోని బావిలో పడేసి.. క్షుద్ర పూజలు జరిగినట్లు నమ్మించారు. 

ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

పాప కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా.. విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు