తెలంగాణ ఎన్నికలకు మూడు నెలల ముందే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చిన బీఆర్ఎస్ (BRS) బాస్ కేసీఆర్.. 10 మందికి షాక్ ఇవ్వనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దాదాపు ఏడుగురు మినహా మిగిలిన సిట్టింగ్లకు సీట్లని ప్రకటించడంతో అంతా ఆనందంతో పండుగ చేసుకున్నారు. అయితే వాళ్ల సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. మీకు సీట్లు లేనట్లేనంటూ కేసీఆర్ సంకేతాలివ్వడంతో వారంతా లబోదిబోమంటున్నారు. ముందుగానే 18 నుంచి 25 మంది సిట్టింగ్లకు సీట్లు కష్టమేనంటూ ప్రచారం సాగింది. ఆ ప్రచారానికి భిన్నంగా ఏడుగురుని మాత్రమే మారుస్తూ.. సీఎం కేసీఆర్ లిస్ట్ ప్రకటించారు. కాని నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత.. సీనియర్ లీడర్ల నిరసనలతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 10 మందికి బీఫారం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి హరీష్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మల్కాజ్గిరి (Malkajgiri) అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును మారుస్తారనే ప్రచారం ఉన్నా.. ఆయనతో పాటు మరో 9మందికి గులాబీ బాస్ నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పూర్తిగా చదవండి..CM KCR: ఆ 10 మందికి కేసీఆర్ షాక్.. టికెట్ లేనట్లేనంటూ సంకేతాలు!
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. కాని నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత.. సీనియర్ లీడర్ల నిరసనలతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 10 మందికి బీఫారం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి హరీష్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మల్కాజ్గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును మారుస్తారనే ప్రచారం ఉన్నా.. ఆయనతో పాటు మరో 9మందికి గులాబీ బాస్ నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Translate this News: