TG Govt: బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

బెట్టింగ్ యాప్ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రాణాలు కోల్పోవడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
Telangana CM Revanth reddy

Telangana

బెట్టింగ్ యాప్ కేసు విషయంలో రోజురోజుకీ కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. వీటిపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ కేసులు హల్‌చల్ చేస్తున్నాయి. వీటివల్ల ఎందరో ఆర్థికంగా నష్టపోవడం, కొందరు ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ ఒక్కసారిగా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపింది. మరి ఈ బెట్టింగ్ కేసు విషయంలో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. 

ఇది కూడా చూడండి: Liquor Shops : 1+1..వైన్ షాప్స్ బంపరాఫర్.. ఎగబడ్డ మందుబాబులు!

మొత్తం 11 మందిపై..

ఇదిలా ఉండగా తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్‌పై గత కొద్ది రోజుల నుంచి ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై, అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మంది సినీ నటీ నటులపై కేసులు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: PF Withdraw -Atm: ఇక ఏటీఎం నుంచి పీఎఫ్‌ నగదు తీసుకోవచ్చు...ఎప్పటి నుంచో తెలుసా?

అందులో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి సహా మరెంతో మంది నటీ నటులపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు ఈ కేసులో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులను సైతం నిందితులుగా చేర్చారు. 
మొత్తం 19 యాప్‌ల పేర్లను నిందితుల లిస్ట్‌లో జతచేశారు. అందులో ఏ23, జంగ్లీ రమ్మీ డాట్‌కామ్, వీవీబీబాక్, ఫెయిర్‌ప్లే, జీత్‌విన్, వీఎల్‌బుక్,  మామ247, తాజ్‌77, ధని బుక్‌365, యోలో247డాట్‌కామ్,  తెలుగు365, యెస్‌365, జై365, వీవీబుక్, ఓకేవిన్, పరిమ్యాచ్, తాజ్‌777బుక్, జెట్‌ఎక్స్,  ఆంధ్రా365 తదితర యాప్‌ల పేర్లను చేర్చారు.  అయితే సినీ సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులిచ్చి విచారించే ముందు పోలీసులు న్యాయసలహా తీసుకున్నట్లు తెలిసింది. 

ఇది కూడా చూడండి: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?

 

cid | cinema news in telugu | hyderabad | betting-apps | latest telangana news | telangana news today | telangana-news-updates | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు