Khushboo Patani: చిన్నారిని కాపాడిన దిశా పటాని అక్క .. ఈ విషయం తెలుసుకుంటే సెల్యూట్‌ చేస్తారు

నటి దిశా పటానీ అక్క  ఖుష్బూ నెలల చిన్నారిని కాపాడి క్షేమంగా తలిదండ్రులకు అప్పగించారు. ఉదయం ఆమె వాకింగ్ చేస్తూ వెళ్తుండగా తన ఇంటి సమీపంలోని  ఓ పాడుబడ్డ భవనంలో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. దీంతో ఆమె ఆ పాపను కాపాడి తిరిగి ఇంటికి చేర్చింది.

New Update
disha patani sister rescued a child

disha patani sister rescued a child

ఓ పాడుబడ్డ బంగళాలో ఒంటరిగా వెక్కి వెక్కి ఏడుస్తున్న నెలల చిన్నారిని నటి దిశా పటానీ అక్క  ఖుష్బూ పటానీ కాపాడి క్షేమంగా తలిదండ్రులకు అప్పగించారు. ఆమె చేసిన ఈ పనికి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే... 

పాడుబడ్డ భవనంలో చిన్నారి 

మాజీ  ఆర్మీ ఆఫీసర్ గా పనిచేసిన ఖుష్బూ ప్రస్తుతం జిమ్ ట్రైనర్ గా ఉన్నారు. ఈమె ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో నివాసం ఉంటున్నారు. అయితే  ఆదివారం  ఉదయం ఖుష్బూ  వాకింగ్ కి వెళ్తుండగా ఆమె ఇంటి సమీపంలోని  ఓ పాడుబడ్డ భవనం నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో ఖుష్బూ ఆ చిన్నారిని కాపాడడానికి లోపలి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ లోపలి వెళ్లడానికి సరైన దారి లేకపోవడంతో ఆమె పెద్ద సాహసమే చేశారు. కాంపౌండ్ గోడెక్కి, లోపలి వెళ్లి.. చిన్నారిని రక్షించారు. ఆమె చూసినప్పుడు చిన్నారి బట్టలు దుమ్ముగా, మొహంపై చిన్న గాయాలు ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. 

Also Read :  ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంట్రా.. ‘సీఎం రేవంతన్న కుదిర్చిన ముహూర్తానికే నా పెళ్లి.. లేదంటే’!

Also Read :  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని రమేష్

మోదీని ట్యాగ్ చేస్తూ.. 

ఇందుకు సంబంధించిన దృశ్యాలను  ఖుష్బూ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తల్లిదండ్రులపై మండిపడ్డారు. పాప ఫొటో చూసి ఎవరైనా గుర్తుపడితే తమకు తెలియజేయాలని కోరారు.  అలాగే ఈ పోస్టుకు బరేలీ పోలీస్‌, యూపీ పోలీస్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ప్రధాని మోదీ తదితర ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను ట్యాగ్ చేశారు. అధికారులు వెంటనే పాప సంరక్షణకు సంబంధించిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. 

ఖుష్బూ పటానీ
ఖుష్బూ పటానీ

Also Read :  సింగర్ సునీత అలాంటిదా..! కంటెస్టెంట్ ప్రవస్తి మాటలు వింటే మతిపోతుంది..

అనంతరం స్టేషన్ కి వెళ్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు పాప తల్లిదండ్రులను కనిపెట్టి.. పాపను క్షేమంగా వారికి అప్పగించారు. పాప పేరు రాధ అని తెలిపారు. ఈ మేరకు ఖుష్బూ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ ఘటనను ఒక కిడ్నాప్ కేసుగా పేర్కొన్నారు. పాపను అక్కడ వదిలేసి వెళ్ళింది ఎవరు? అనే విషయాలపై సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు పోలీసులు. 

గతంలో ఆర్మీ ఆఫీసర్ గా పనిచేసిన ఖుష్బూ ప్రస్తుతం జిమ్ ట్రైనర్ గా ఉన్నారు. 

Also Read :  లిక్కర్ స్కామ్ లో సంచలనం.. మరో ఆడియో విడుదల చేసిన రాజ్ కసిరెడ్డి!

 

telugu-news | telugu-cinema-news | disha-patani | latest-telugu-news | today-news-in-telugu | telugu-film-news | bollywood

Advertisment
Advertisment
తాజా కథనాలు