/rtv/media/media_files/2025/01/23/EwnzTmngl5sRksql3heF.jpg)
cm revanth vs bunny
CM Revanth: అల్లు అర్జున్ (Allu Arjun) తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా అసెంబ్లీ వేదికగా అతన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఓ నిండు ప్రాణం బలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మరోసారి అల్లు అరెస్టు పై స్పందించారు.
Also Read: Meerpet Incident: 72 గంటలు భార్య శవాన్ని ఉడికించి.. ఆరబెట్టి పొడిచేసి.. ఇదొక భయంకరమైన హత్య!
రేవంత్ కామెంట్స్..
దావోస్ పర్యటనలో ఓ ఆంగ్ల మీడియా ప్రతినిధి తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించగా.. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. రెండు రోజుల ముందు థియేటర్ కి రావడానికి పర్మిషన్స్ కోసం వస్తే పోలీసులు నిరాకరించారు. అయినప్పటికీ అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారు. ఈ క్రమంలో అక్కడికి జనం భారీగా తరలి వచ్చారు. దీంతో ఆయనతో వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది జనాలను తోసేశారు. ఆ క్రమంలోనే తొక్కుసలాట జరిగి ఒకరు చనిపోయారు. ఒక వ్యక్తి చనిపోవడం అయన చేతుల్లో లేకపోవచ్చు. కానీ ఒక మహిళ చనిపోతే 10-12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది’’ అని అన్నారు ముఖ్యమంత్రి.
Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు
ఇది ఇలా ఉంటే.. అల్లు అర్జున్ 'పుష్ప2' డైరెక్టర్ సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా పలువురు సినీ నిర్మాతల ఇళ్లల్లో తనిఖీలు చేస్తున్నారు. పుష్ప-2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై లెక్కలు అడుగుతున్నారు. మరో వైపు దిల్ రాజ్ ను సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా తీస్తున్నారు. అలాగే సినిమా బడ్జెట్ లకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లోనూ తనిఖీలు చేస్తున్నారు.
Also Read: Sukumar: సుకుమార్ ఇంటిపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. రెండో రోజు కూడా