/rtv/media/media_files/2025/02/11/yRfB1iBsYU7oeHCYb0ju.jpg)
Stock Market On Monday
అమెరికా విధించిన అదనపు సుంకాలు రేపటి నుంచి అమలు అవనున్నాయి. దీని ప్రభావం ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్ నష్టాలతో(Stock Market Losses Today) ప్రారంభం అయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రతికూల సంకేతాలు నడుస్తున్నాయి. దీంతో ఉదయం ప్రారంభం నుంచి సూచీలు పడిపోయాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు తగ్గి 81,000 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 200 పాయింట్లకు పైగా పడిపోయి 24,750 స్థాయిలో ట్రేడవుతోంది. బిఎస్ఇ సెన్సెక్స్ 629 పాయింట్లకు పైగా పడిపోగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ(nifty) 200 పాయింట్లకు పైగా పడిపోయింది.
Also Read : ఉద్యోగులకు డెంట్సు బిగ్ షాక్.. 3,400 మంది ఔట్!
దాదాపు అన్ని స్టాక్స్ డౌన్..
సెన్సెక్స్ లోని 30 స్టాక్స్ లో 28 డౌన్ ఫాల్(sensex-crash-today) లో ఉన్నాయి. కేవలం రెండు మాత్రమే పెరిగాయి. ఫార్మా, మెటల్, ఎనర్జీ స్టాక్ లు అత్యధికంగా నష్టపోయాయి. లార్జ్ క్యాప్ కేటగిరీలో సన్ఫార్మా షేర్ 2.56%, అదానీ పోర్ట్స్ షేర్ 1.80%, టాటా స్టీల్ షేర్ 1.60% మరియు టాటా మోటార్స్ షేర్ 1.10% తగ్గాయి.మిడ్క్యాప్ విభాగంలో, PEL షేర్ 2.82%, Emcure షేర్ 2.65%, భారత్ ఫోర్జ్ షేర్ 2.54%, మజ్గావ్ డాక్ షేర్ 2.48% తగ్గాయి. స్మాల్క్యాప్ విభాగంలో, KITEX షేర్ అత్యధికంగా 4.99% తగ్గింది, ప్రవేగ్ షేర్ 4.80% తగ్గుదలతో ట్రేడవుతోంది. అయితే సౌరశక్తి రంగంలో పనిచేస్తున్న విక్రమ్ సోలార్ కంపెనీ వాటా 2% ఎక్కువగా లిస్ట్ చేయబడింది. దీని ధర పరిధి ₹315-₹332, బదులుగా షేరు రూ.340 వద్ద లిస్ట్ చేయబడింది.
అంతర్జాతీయ మార్కెట్..
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాలు చవిచూస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 1% తగ్గి 42,380 వద్ద, కొరియా కోస్పి 0.83% తగ్గి 3,183 వద్ద ట్రేడవుతున్నాయి. హంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.22% పెరిగి 25,773 వద్ద, చైనా షాంఘై కాంపోజిట్ 3,888 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. అలాగే ఆగస్టు 25న అమెరికా డౌ జోన్స్ 0.77% తగ్గి 45,282 వద్ద ముగిసింది. అదే సమయంలో నాస్డాక్ కాంపోజిట్ 0.22%, ఎస్&పి 500 0.43% పడిపోయాయి.
Also Read : ఓపెన్ AI, ఆపిల్కు BIG SHOCK.. చాట్ GPTపై కేసు వేసిన ఎలన్ మస్క్
Follow Us