/rtv/media/media_files/2025/03/25/yvgGjYlckE8mrggfEthd.jpg)
stock market today
విదేశీ మదుపర్లు భారత మర్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇది మార్కెట్ పెరుగుదలకు కలిసి వచ్చింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ పరుగులు పెడుతున్నాయి. ఆరంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు విశేషంగా రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,500 పైన ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,400 స్థాయిలో ఉంది. 30 సెన్సెక్స్ సూచీల్లో 23 లాభాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు 2.3% వరకు పెరిగాయి. కానీ సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ మరియు నెస్లే షేర్లు మాత్రం క్షీణిస్తున్నాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్స్లో 37 లాభాల్లో ఉన్నాయి. ఎన్ఎస్ఈ సూచీలలో, ప్రభుత్వ రంగ బ్యాంకు సూచీ అత్యధికంగా 1.73% పెరిగింది. ఇది కాకుండా, చమురు మరియు గ్యాస్, ఆటో, మెటల్, మీడియా రంగాలు 1% పెరిగాయి.
ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్లో కాల్పుల విరమణ ప్రకటన
ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన
విదేశీ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు..
ఏప్రిల్ 28న అమెరికా డౌ జోన్స్ 114 పాయింట్లు పెరిగి 40,228 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 17 పాయింట్లు లాభపడ్డాయి. ఎస్&పి 500 ఇండెక్స్ 4 పాయింట్లు పెరిగింది. ఇక ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ కి ఈరోజు సెలవు. నిన్న అది 134.25 పాయింట్లు పెరిగి 35,839 వద్ద ముగిసింది. కొరియాకు చెందిన కోస్పి 19 పాయింట్లు పెరిగి 2,568 వద్ద ట్రేడవుతోంది. ఇక చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ కొద్దిగా తగ్గి 3,287 వద్ద ట్రేడవుతోంది. హాంకాంగ్ తాలూకా హాంగ్ సెంగ్ సూచీ 88 పాయింట్లు (0.40%) పెరిగి 22,060 వద్ద ట్రేడవుతోంది.
today-latest-news-in-telugu | Stock Market Today | sensex | nifty
Also Read: Rahul Gandhi: ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ
ఇది కూడా చూడండి: Pak-India:భారత్తో ఉద్రిక్తతల వేళ పాక్కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!