Big breaking : వైఎస్ షర్మిల అరెస్ట్

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిలను పోలీసులు  హౌస్ అరెస్టు చేశారు. ఈరోజు ఉద్దండరాయునిపాలెంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఈ క్రమంలో ఆమెను హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

New Update
YS Sharmila: నన్ను ఓడించేందుకు కుట్ర.. సీఎం జగన్‌పై షర్మిల విమర్శల దాడి

Andhra Pradesh Congress Committee ys sharmila

Sharmila Arrest: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్ షర్మిలను పోలీసులు  హౌస్ అరెస్టు చేశారు. ఈరోజు ఉద్దండరాయునిపాలెంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఈ క్రమంలో ఆమెను హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చూడండి: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

బుధవారం షర్మిల ఉద్దండరాయుని పాలెం పర్యటన కు వెళ్లాల్సి ఉండగా.. విజయవాడ లోని ఆమె నివాసంలో పోలీసుల హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి ఆందోళనలకు అవకాశం లేకుండా షర్మిల నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించగా.. అందుకు పోలీసులు ఆంక్షలు విధించారు.

ఇది కూడా చూడండి: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

ఉద్దండరాయునిపాలెంలో పర్యటనకు అనుమతి లేదంటూ షర్మిల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆమె నివాసం వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల తీరుపై ఏపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైన ఉద్దండరాయుని పాలెం వెళ్లి తీరుతానని షర్మిల స్పష్టం చేశారు. ఈ క్రమంలో షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇది కూడా చూడండి: DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం

హౌస్‌ అరెస్ట్ పై వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె.. విజయవాడలోని నా ఇంట్లో నన్ను హౌజ్ అరెస్ట్ ఎందుకు చేశారో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నన్ను హౌజ్ అరెస్ట్ చేసేందుకు గల కారణాన్ని ఏపీ ప్రజలకు తెలియజెప్పండి అని అన్నారు. అంతేగాక నా సొంత పని మీద ఆంధ్రప్రదేశ్ పీసీసీ కార్యాలయానికి వెళుతున్న నన్ను అడ్డుకోవడం నేరం కదా? అని ప్రశ్నించారు. ఇక మా రాజ్యాంగ హక్కులను కాలరాయాలని చూస్తున్నారా అంటూ.. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని షర్మిల రాసుకొచ్చారు.

ఇది కూడా చూడండి: Iphone 17 Series: ఐఫోన్ 17 ప్రో నుంచి కిర్రాక్ అప్డేట్.. ధర, లాంచ్, డిజైన్, కలర్ - ఫుల్ డీటెయిల్స్ ఇవే!

    ప్రధాని నరేంద్ర మోదీ మే2న అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని నిర్మాణం పనులను పున: ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మురంగా జరుగుతున్నాయి. మరోవైపు షర్మిలపై ప్రధాని నరేంద్ర మోదీ అభిమాని పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోదీపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారతదేశం నిఘా వ్యవస్థలపైనా, దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని, భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు