/rtv/media/media_files/2025/06/01/kgYD9YitdNcJXt156Nla.jpg)
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తిని బంకు మేనేజర్లు దుస్తులు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో చూసి చాలా మంది బంకు మేనేజర్లపై మండిపడుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ కామెంట్లు పెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
బట్టలు ఊడదీసి కొట్టారు
కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని పెట్రోల్ బంకులో బాబాఫకృద్దీన్ అనే వ్యక్తి పంపు బాయ్గా పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగానే శనివారం తన డ్యూటీ టైం అయిపోయి ఇంటికి వెళ్లే సమయంలో ఆ రోజు జమ అయిన డబ్బులను మేనేజర్లు సత్యనారాయణ, అమర్లకు అప్పగించాడు. అయితే అందులో దాదాపు రూ.23 వేలు తక్కువగా ఇచ్చావంటూ మేనేజర్లు ఫకృద్దీన్ను అడిగారు.
Also Read: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో
‘‘ఏమో సర్ నాకు తెలీదు.. నేను వాటిని వాడుకోలేదు.. వచ్చిన డబ్బంతా మీకే అప్పగించాను’’ అని ఫకృద్ధీన్ సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన మేనేజర్లు.. తక్కువగా ఉన్న డబ్బులను చెల్లించేవరకు ఇక్కడ నుంచి వెళ్లొద్దని హెచ్చరించారు. అనంతరం కోపంతో ఊగిపోయిన మేనేజర్లు పకృద్ధీన్ బట్టలు ఇప్పించి పక్కనే ఉన్న టెలిఫోన్ స్తంభానికి కట్టేసి చితకబాదారు.
Also Read: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో
అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్గా మారింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అనంతరం బాధితుడిని హాస్పిటల్కు తరలించారు.
Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
satyasai-district | andhra-pradesh-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu crime news | telugu viral news