Crime: దుర్మార్గం...విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారం..బిడ్డకు జన్మనివ్వడంతో...!!
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై పలుమార్లు అఘాత్యానికి పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని బిడ్డకు జన్మనివ్వడంతో అసలు విషయం వెలుగుచూసింది. కదిరి నియోజకవర్గానికి చెందిన బాలిక 9నెలల క్రితం ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. నీళ్లు తాగేందుకు స్టాఫ్ గదిలోకి వెళ్లగా అక్కడ ఒంటరిగా ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అఘాత్యానికి ఒడిగట్టాడు.దీంతో ఆ విద్యార్థిని భయంతో తనపై జరిగిన విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. ఇదే అదనుగా భావించిన ఆ ఉపాధ్యాయుడు పలుమార్లు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో శనివారం విద్యార్థినికి కడుపు నొప్పి రావడంతో...కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ విద్యార్థిని.