/rtv/media/media_files/2025/03/14/jSa4S4JtyOegIK9iXLMT.jpg)
gudur railway station Photograph: (gudur railway station)
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్రం రైల్వే స్టేషన్లు అప్గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధునీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని గూడూరు రైల్వే స్టేషన్ మోడ్రనైజేషన్కు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49 కోట్లు మంజూరు చేసింది. తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంతాలలో మెరుగైన రైల్వే సదుపాయాలు కల్పించనున్నారు. గూడూరు రైల్వే స్టేషన్లో అత్యాధునిక హంగులతో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. అప్గ్రేడ్ చేయబడిన గూడూరు రైల్వే స్టేషన్ ఒక ల్యాండ్మార్క్ సౌకర్యంగా ఉంటుంది, ఇది ప్రయాణీకులకు మంచి సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుందని డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ పాటిల్ అన్నారు.
Also read; JD Vance: అమెరికా పౌరసత్వంపై జేడీ వాన్స్ సంచలన కామెంట్స్
రెండు అంతస్తుల స్టేషన్ బిల్డింగ్, ఐదు ప్లాట్ఫారమ్లపై షెడ్,12 మీటర్ల వెడల్పు గల పైకప్పు ప్లాజా, స్టేషన్ ఎంట్రన్స్లో ఆర్చ్ నిర్మాణాలు చేయనున్నారు. విజయవాడ డివిజన్లోని 21 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామని, మొత్తం రూ.567 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై