Lightning Strike: ఏపీలో ఘోర విషాదం.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే క్రమంలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

New Update
Three killed in lightning strike in Prakasam district

Three killed in lightning strike in Prakasam district

ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం దంచి కొడుతుంది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో వాన జల్లులు కురుస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. 

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

విషాదం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిడుగులు పడి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, బాపట్ల, ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షం ప్రజలను వణికిస్తోంది. 

Also Read :  దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

దీని  కారణంగా రోడ్లన్ని జలమయం అయ్యాయి. ప్రజలు తమ ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు.  ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెట్లు, హోర్డింగులు నేలకూలడంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక విజయవాడలో ఇవాళ మార్నింగ్ నుంచి వర్షం కురుస్తూనే ఉంది. 

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

చాలా రోజుల నుంచి ప్రజలు ఎండతీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. ఉక్క, చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అలాంటి సమయంలో రాష్ట్రంలో వర్షం పడటంతో కొంత ఉపశమనంగా మారింది. విజయవాడలోని చిట్టినగర్, పటమట, మొగల్రాజపురం, పండిట్ నెహ్రూ బస్టాండ్  ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. 

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

ap-weather | AP Weather Alert | weather | AP Weather Latest Update | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు